Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్.. 28న శ్రీవారి ఆలయం మూసివేత

పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈనెల 28న మూసి వేయనున్నారు.

Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్.. 28న శ్రీవారి ఆలయం మూసివేత

Tirumala Tirupati Devasthanams

Tirumala Tirupati Devasthanams: ఈనెల 29న పాక్షిక చంద్రగ్రహణం. ఆరోజు తెల్లవారు జామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగహణం ఉంటుంది. ఈ కారణంగా 28న శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. గ్రహణం సమయానికి ఆరు గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో 28వ తేదీ రాత్రి 7.05 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 3.15 గంటల వరకు సుమారు ఎనిమిది గంటలపాటు శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయటం జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

28వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 9గంటల వరకు అన్నప్రసాద కేంద్రంకూడా మూసివేయడం జరుగుతుందని, 28వ తేదీ శ్రీవారి ఆలయంలో పలు అర్జిత సేవలు రద్దు చేయడం జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

Also Read: డీజిల్ ట్యాంకర్ బోల్తా.. క్యాన్లకు పనిచెప్పిన స్థానికులు.. వీడియో వైరల్