Chandrababu-Pawan: శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు, ఏలూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన
ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు నేరుగా ఇవ్వనన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఇచ్చాపురం మండలం, ఈదుపురం గ్రామంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి శ్రీకాకుళానికి వస్తున్నారు చంద్రబాబు.
ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు నేరుగా ఇవ్వనన్నారు. ఈదుపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడతారు. 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అలాగే, ఇవాళ ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటిస్తారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో 10 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. రాజమండ్రి నుంచి ద్వారకా తిరుమలకు రోడ్డు మార్గాన రానున్నారు.
ద్వారకా తిరుమల మండలం ఐ.యస్ జగన్నాథపురం గ్రామంలో ఉచిత గ్యాస్ సిలిండర్స్ ను లబ్ధిదారులకు అందజేయనున్నారు పవన్. ఆ తర్వాత ఐ.యస్ జగన్నాథపురంలో కొండపై నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు.
Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు..!