Chandrababu : ఏపీ డీజీపీకి చంద్రబాబు మరో లేఖ.. అతడికి ప్రాణహాని ఉంది.. భద్రత పెంచండి

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. టీడీపీ నేత దాస్ కు అధికార పార్టీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు.

Chandrababu : ఏపీ డీజీపీకి చంద్రబాబు మరో లేఖ.. అతడికి ప్రాణహాని ఉంది.. భద్రత పెంచండి

Chandrababu

Updated On : January 8, 2022 / 2:51 PM IST

Chandrababu : ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన పులి, దాస్‌ అలియాస్ చిన్నాలకు అధికార పార్టీకి చెందిన వారితో ప్రాణహాని ఉందని డీజీపీ దృష్టికి తీసుకెళ్లిరు.. పులి, దాస్ టీడీపీలో క్రియాశీలక సభ్యునిగా ఉంటూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. అది దృష్టిలో పెట్టుకొని వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ ఆయనపై పగ పెంచుకున్నారని.. ఈ నేపథ్యంలోనే దాస్‌ను నందిగాం సురేష్ టార్గెట్ చేశారని పేర్కొన్నారు.

చదవండి : Chandrababu : మూడు జనవరిలు పోయాయి, ఇంకా జాబ్ క్యాలెండర్ లేదు-చంద్రబాబు

ఎంపీ సురేష్ ఆదేశాలతో ఇప్పటికే దాస్ పై 30కేసులు పెట్టారని.. గతేడాది సెప్టెంబర్ 18న ఎంపీ నందిగాం సురేష్ అనుచరులు ఉద్దండరాయునిపాలెంలో దాస్ పై మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని బాబు లేఖలో పేర్కొన్నారు. దాస్ బిన్‌ను చంపాలనే ఉద్దేశంతో ప్రతి రోజు అతని కదలికలను అనుసరిస్తూ ఆయన ఇంటిపై నిఘా ఉంచారని డీజీపీకి లేఖద్వారా తెలిపారు బాబు. దాడులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని, దాస్‌కు ఎలాంటి హాని జరగకుండా చూసేందుకు తగిన పోలీసు రక్షణ కల్పించాలని బాబు కోరారు.

చదవండి : Chandrababu: పవన్ కళ్యాణ్‌తో పొత్తుపై చంద్రబాబు చెప్పిన లవ్ స్టోరీ!