తిరుపతిలో కరోనా కలకలం.. భయాందోళనలో జనం
చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా లక్షణాలతో తైవాన్కు చెందిన వ్యక్తి రుయా ఆసుపత్రిలో చేరాడు. బంగారుపాళ్యెంలోని ఓ ఫ్యాక్టరీలో మరమ్మతుల కోసం

చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా లక్షణాలతో తైవాన్కు చెందిన వ్యక్తి రుయా ఆసుపత్రిలో చేరాడు. బంగారుపాళ్యెంలోని ఓ ఫ్యాక్టరీలో మరమ్మతుల కోసం
చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా లక్షణాలతో తైవాన్కు చెందిన వ్యక్తి రుయా ఆసుపత్రిలో చేరాడు. బంగారుపాళ్యెంలోని ఓ ఫ్యాక్టరీలో మరమ్మతుల కోసం ఆ వ్యక్తి భారత్కు వచ్చాడు. గత రెండు రోజులుగా తీవ్ర జలుబు, దగ్గుతో బాధపడుతుండడంతో రుయా ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం ఆ యువకుడిని ఐసోలేటేడ్ వార్డులో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అతడి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపారు. మరో రెండు రోజుల్లో అతనికి కరోనా వైరస్ ఉందా లేదా అన్న విషయాన్ని డాక్టర్లు తేల్చనున్నారు.
కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో తైవాన్ వ్యక్తి ఆసుపత్రిలో చేరడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో తిరుపతి వాసుల్లో భయాందోళన నెలకొంది. అసలే కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా సోకిన మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనాకు ఇప్పటివరకు వ్యాక్సిన్ కనుక్కోలేదు. దీంతో జనాలు భయపడుతున్నారు.
చైనాలోని వుహాన్(wuhan) ప్రావిన్స్ నుంచి ప్రపంచానికి పాకిన ఈ కోవిడ్19 (కరోనా వైరస్) కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 83వేల మంది కరోనా వైరస్ తో బాధపడుతున్నారు. కరోనా వైరస్ భయంతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. సుమారు 50 దేశాలకు కరోనా వ్యాపించింది. చైనా తర్వాత దక్షిణ కొరియా, ఇటలీ దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కరోనా ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా పడింది. పలు దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి.