సిగరెట్లో చుక్క కలిపితే.. 24 గంటలు మత్తులో..

illegal Drug Hashish Oil Vizag High Demand : హషీస్.. నిషా ఎక్కించే ఆయిల్.. గంజాయి నుంచి తీసిన ఈ ఆయిల్ సిగరేట్ లో ఒక్క వేసి పీలిస్తే చాలు.. 24 గంటల పాటు మత్తులో తూలిపోవాల్సిందే.. చాలామంది యువత దీనికి ఎక్కువగా బానిసలవుతున్నారు.. ఈ ఆయిల్ కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు. ఇటీవల వాట్సాప్లో ఆర్డర్ తీసుకుని మరి హోం డెలివరీ చేస్తున్నారు. పార్శిల్ డెలివరీ యాప్లను సైతం ఉపయోగిస్తున్నారు. ఈ ఆయిల్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్తోపాటు పలు రాష్ర్టాలకు సరఫరా అవుతుంది. ఆయిల్ రవాణాపై రాచకొండ పోలీసులు నిఘా పెట్టారు.
గంజాయిని బాగా మరగబెట్టిన తర్వాత ప్రొఫైల్ ఆల్కాహాల్ రసాయనాన్ని కలిపి హషీష్ ఆయిల్ను తయారు చేస్తారు. రాచకొండ ఎస్ఓటీ పోలీసులు నిందితుడు లక్ష్మీపతిని అరెస్ట్ చేశారు. విచారణలో అతడు ఈ ఆయిల్ విషయాన్ని బయటపెట్టాడు.
గంజాయి సరఫరాపై పోలీసుల నిఘా ఉండటంతో ఎవరీకి అనుమానం రాకుండా ఉండేందుకు ఈ ఆయిల్ తయారు చేసి అమ్ముతున్నట్టు విచారణలో వెలుగులోకి వచ్చింది. తేనె రంగులో ఉండటంతో.. దాన్ని ఎవరూ సరిగ్గా గుర్తించలేరు. సరఫరాకు కూడా ఎలాంటి అడ్డంకులు ఉండవని సరఫరాదారులు విశాఖపట్నంలో ఈ ఆయిల్ను తయారు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ హషీష్ ఆయిల్ను సిగరెట్ పొగాకులో కలిపి మత్తును పీలుస్తారు. ప్రత్యేకంగా ఓసీబీ పేపర్ను వాడుతారు. సిగరెట్లోని పొగాకు తీసి.. దానిని ఓసీబీ పేపర్లో పెట్టి ఒక చుక్క హషీస్ ఆయిల్ కలుపుతారు. పేపర్ను సిగరెట్ లాగా చుట్టి ముక్కు దగ్గర పెట్టుకుని గట్టిగా పీలుస్తారు.
ఒక్క సిగరెట్ తాగితే దాదాపు 24 గంటల పాటు మత్తు ఉంటుందంట.. 10mlకు రూ.3వేలకు విక్రయిస్తున్నారంట.. మార్కెట్లో 10mlను రూ.5వేల వరకు విక్రయిస్తున్నారు. వాట్సాస్ గ్రూపుల ద్వారా ఆర్డర్ తీసుకొని.. పార్శిల్ యాప్ల ద్వారా హోం డెలివరీ ఇస్తున్నారు.