హాస్టళ్లలో ‘Nadu-Nedu, ‘జగనన్న గోరుముద్ద’ మాదిరిగా మెనూ ఉండాలి

cm ys jagan review meeting: అన్ని హాస్టళ్లలో నాడు నేడు అమలు చేసి, వాటి పరిస్థితిని మార్చాలన్నది ప్రభుత్వ సంకల్పమని ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) చెప్పారు. Nadu-Nedu లో భాగంగా అన్ని హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత శానిటేషన్, చక్కటి వాతావరణంతో పాటు, విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు ఉండాలన్నారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో నాడు – నేడు సీఎం వైఎస్ జగన్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు, సలహాలు అందచేశారు.
జగనన్న విద్యా కానుకను హాస్టల్ విద్యార్థులకు కూడా ఇస్తాం కాబట్టి, హాస్టళ్లలో కూడా స్థితిగతులు పూర్తిగా మారాలన్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్కు మంచి పౌష్టికాహారం ఇవ్వాలని అన్నారు. విద్యార్థులకు ఏం కావాలి? ఏం ఇస్తే బాగుంటుంది? వారికి ఏ విధంగా మంచి పౌష్టికాహారం ఇవ్వాలనే వాటిపై పక్కాగా ప్లాన్ చేయాలని అధికారులకు సూచించారు సీఎం జగన్.
వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలి’ అని అధికారులను ఆదేశించారు. జగనన్న గోరుముద్ద’ మాదిరిగా మెనూ ఉండాలి. మన కొడుకు లేక కూతురు ఆ హాస్టల్లో ఉండి చదివితే, అక్కడ ఎలా ఉండాలని కోరుకుంటామో, ఆ విధంగా మన హాస్టళ్లను మార్చాలని సూచించారు.
హాస్టళ్లలో పూర్తి వసతులను నాడు – నేడులో కల్పిస్తామని, పిల్లలకు కూడా బెల్టులు, దుప్పట్లు, అల్మారాలు, మంచాలు, ఇతర కనీస వసతులు ఉండాలన్నారు. నాడు –నేడు రెండో దశ కార్యక్రమంలో ఆ హాస్టళ్లలో మార్పులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అన్ని సంక్షేమ శాఖలకు సంబంధించి బాలురు, బాలికల కోసం మొత్తం 4వేల 772 హాస్టళ్లు ఉండగా, వాటిలో 4 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. మొత్తం హాస్టళ్లలో దాదాపు 4 వేలు సొంత భవనాల్లో ఉన్నాయని తెలిపారు. నాడు – నేడు రెండో దశ కార్యక్రమంలో ఆ హాస్టళ్లలో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు.
సీఎం జగన్ నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో..డిప్యూటీ సీఎం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్తో పాటు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.