నాకు ఎలాంటి బెదిరింపులు రాలేదు, కూటమి సునామీకి ప్రధాన కారణమిదే- కేకే కీలక వ్యాఖ్యలు

వత్తిడికి లోనవడమా..? క్రెడిబులిటీ పెంచుకోవడమా? అన్నది సర్వే కంపెనీ నిర్ణయించుకోవాలి. సాధారణంగా రాజకీయ పార్టీలు సర్వే కంపెనీలపై ఒత్తిడి పెడతాయి.

నాకు ఎలాంటి బెదిరింపులు రాలేదు, కూటమి సునామీకి ప్రధాన కారణమిదే- కేకే కీలక వ్యాఖ్యలు

KK Survey : ఏపీలో కూటమి విజయానికి ప్రధాన కారణం ఏంటో చెప్పారు ప్రముఖ సెఫాలజిస్ట్ కేకే. మూడు పార్టీలు కలిసి కూటమిగా వెళ్లడమే గెలుపునకు ప్రధాన కారణం అన్నారాయన. ఏపీ ఎన్నికల్లో కూటమి సునామీని ముందే ఊహించిన ఏకైక వ్యక్తిగా కేకే పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఆయన ఎగ్జిట్ పోల్ ఎగ్జాట్ అయ్యింది. అంకెలతో సహా కూటమి పార్టీలకు ఇన్ని సీట్లు వస్తాయని కేకే ముందే చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే సీట్లు వచ్చాయి.

ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయంపై కేకే స్పందించారు. ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టిస్తుందని తాను అంత కచ్చితంగా ముందే చెప్పడానికి కారణం ఏంటో కూడా ఆయన తెలియజేశారు. కేకే.. ప్రస్తుతం ఒక బ్రాండ్ అయ్యిందని ఆయన అన్నారు. ఏపీ ఎన్నికల్లో మేము చెప్పింది నిజమైందని చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్ఫెక్ట్ సర్వేతోనే ఇది సాధ్యమైందని వెల్లడించారు.

”సర్వే కంపెనీలు మార్జిన్ పెట్టుకుంటాయి. మేము అలా వద్దని సింగిల్ నెంబర్ డిసైడ్ చేశాం. సాంప్లింగ్ విధానం పక్కాగా చేశాం. అందుకే దీమాగా చెప్పాము. మమ్మల్ని నమ్మిన కోట్లాది మంది ప్రజలకు కృతజ్ఞతలు. ఏపీలో మూడు నెలల పాటు సర్వే చేశాము.

కాస్ట్ తో 50శాతం ఉంటే.. ఉద్యోగులు, నిరుద్యోగులు, రోడ్లు, ఇలా ప్రతి అంశం ఇంపాక్ట్ చూపింది. వత్తిడికి లోనవడమా..? క్రెడిబులిటీ పెంచుకోవడమా? అన్నది సర్వే కంపెనీ నిర్ణయించుకోవాలి. సాధారణంగా రాజకీయ పార్టీలు సర్వే కంపెనీలపై ఒత్తిడి పెడతాయి. ఏపీలో కూటమి గెలువడానికి వెన్నుముకగా జనసేన నిలిచింది. ఏపీలో కూటమిగా వెళ్లడం.. విజయానికి ప్రధాన కారణమైంది. నాకు ఎలాంటి బెదిరింపులు రాలేదు” అని కేకే చెప్పారు.

Also Read : ఏపీలో కూటమి సునామీ.. కేకే చెప్పిందే అక్షరాల నిజమైంది..!