మోహన్ బాబు యూనివర్సిటీలో ఆందోళనలు.. మంచు మనోజ్ ఏమన్నారో తెలుసా?
తాను వాటిని వ్యక్తిగతంగా తన తండ్రి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు.

Manchu Manoj
తిరుపతి రూరల్ రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీ శ్రీ విద్యానికేతన్లో ఫీజుల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. దీనిపై మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ స్పందిస్తూ.. ఆ ఆందోళనల గురించి తెలుసుకున్నానని, తనకు చాలా బాధ కలిగిందని చెప్పారు.
తమ తండ్రి, ఛాన్సలర్ మోహన్ బాబు విద్యార్థులు, రాయలసీమ సమాజ శ్రేయస్సుకు ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తూ ఉంటారని తెలిపారు. ఇది ఈ సంస్థల విజయంలో ప్రతిబింబిస్తుందని, మోహన్ బాబు విజన్, ప్యాషన్, మనసును దృష్టిలో ఉంచుకుని, ఈ సమయంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్కి తన పూర్తి మద్దతును అందించాలనుకుంటున్నానని చెప్పారు.
పరిస్థితిని అంచనా వేయడానికి తాను ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ని సంప్రదించానని తెలిపారు. ఆయన అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే mm.mbu0419@gmail.comకి ఈ-మెయిల్ పంపాలని ఆయన కోరారు. తాను వాటిని వ్యక్తిగతంగా తన తండ్రి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. తాము తమ విద్యార్థులకు, సమాజానికి మద్దతు ఇవ్వడంలో నిబద్ధతతో ఉన్నామని చెప్పారు.
I’ve been made aware of concerns at @IVidyanikethan #MBUniversity from it deeply saddens me. My father, Chancellor Sri Dr. Mohan Babu garu, has always prioritized the well-being of students and the Rayalaseema community, which is reflected in the success of these institutions.…
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 14, 2024
Also Read: ఏపీలో హైడ్రా ఏర్పాటు చేయాలి.. వాళ్ల ఇళ్లు కూల్చేయాలి: కేఏ పాల్