Nara Lokesh : ప్రజలు జగన్ ప్రభుత్వానికి పాడె కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి : నారా లోకేశ్
జనం రోడ్డెక్కితే సిఎం జగన్ జడుసుకుంటున్నారు అంటూ నారాలోకేశ్ ఎద్దేవా చేశారు.నిరసనల మాట వింటే ఉలిక్కి పడుతున్నారు.

Nara Lokesh
ఏపీలో నిరసనల మాట వింటేనే జగన్ ఉలిక్కి పడుతున్నారు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అంటూ సెటైరలు వేశారు. నిరసనలు వ్యక్తం చేస్తున్న అంగన్ వాడీలపై పోలీసులు వ్యవహరించినతీరుపై లోకేశ్ మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసతే అంగన్ వాడీ కార్యకర్తల(AnganWadi Workers protest)పై అంత కర్కకశమా?అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దమనకాండను ప్రజలు అంతా గమనిస్తున్నారని..త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి పాడెకట్టటానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు.రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై సిఎం జగన్ అణిచివేత వైఖరిని లోకేష్ తీవ్రంగా ఖండించారు.
జనం రోడ్డెక్కితే సిఎం జగన్ జడుసుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు.నిరసనల మాట వింటే ఉలిక్కి పడుతున్నారని…ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ప్రశ్నించే గళాలను చూసి భయపడుతోంది అంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.చంద్రబాబు అరెస్టుపై, తమ హక్కుల కోసం పోరాడుతున్న వివిధ వర్గాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జగన్ పిరికితనాన్ని చాటిచెపుతోందన్నారు.
తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలు చేపట్టిన అంగన్ వాడీలపై సోమవారం (సెప్టెంబర్ 25,2023) పోలీసుల నిర్బంధం తీరు నిర్ఘాంతపరిచిందని అన్నారు.
ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన ఆ మహిళపై అంత కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటో అర్ధం కావడం లేదన్నారు.ప్రజాస్వామ్యంలో నిరసనలు, వ్యతిరేక గళాలు ఉంటాయన్న విషయం జగన్ తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై రాష్ట్రంలో నిరసనలకు దిగిన మహిళలు, నేతలపై పోలీసుల దమనకాండను ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు.అతి త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి ఏపీ ప్రజలు పాడెకడతారని దుయ్యబట్టారు నారా లోకేశ్.