CPM Srinivasa Rao : పోలవరం నిర్వాసితుల పునరావాసం బాధ్యత కేంద్రానిదే : శ్రీనివాసరావు
పూర్తి స్థాయి ప్యాకేజీ ఇవ్వకుండా ఖాళీ చేయాలని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పునరావాస బాధితులతో కలిసి శ్రీనివాసరావు పాదయాత్ర చేపట్టారు.

Srinivasa Rao
Polavaram Project : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో పోలవరం ప్రాజెక్టు పునరావాస బాధితుల జీవితం త్రిశంఖు స్వర్గంలో పడిందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. గతంలో వచ్చిన వరదల్లో 193 గ్రామాలు మునిగితే 56 గ్రామాలనే గుర్తించారని తెలిపారు. 2013 చట్టం ప్రకారం 18ఏళ్లు నిండిన వారిని యూనిట్ గా పరిగణించి ప్యాకేజీ ఇస్తామన్నారని పేర్కొన్నారు. పూర్తి స్థాయి ప్యాకేజీ ఇవ్వకుండా ఖాళీ చేయాలని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పునరావాస బాధితులతో కలిసి శ్రీనివాసరావు పాదయాత్ర చేపట్టారు.
13వ రోజు హనుమాన్ జంక్షన్ నుంచి గన్నవరం వరకు పాదయాత్ర సాగుతోంది. ఈ పాదయాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యలు బాబూరావు, మహిళలు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ మేరకు ఆదివారం 10టీవీతో శ్రీనివాసరావు ప్రత్యేకంగా మాట్లాడారు. అక్కడ ప్రతి ఇంటికి ఒక విషాధ గాధ ఉందని, గోదావరి వరదలు వారికి మొదటి నుంచి అలవాటేనని చెప్పారు.
Atchenaidu : వైసీపీ నేతలు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు : అచ్చెన్నాయుడు
పోలవరం కాపర్ డ్యాం వల్ల పైనుంచి పెద్ద వరద వచ్చిందన్నారు. ఇప్పుడు వరద ముంపును గుర్తు చేసుకుని మళ్లీ భయ పడుతున్నారని వెల్లడించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటే… పునరావాసం బాధ్యత కేంద్రానిదేనని పేర్కొన్నారు. రూ.33 వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నా.. మోదీ ఏడున్నర వేల కోట్ల రూపాయలు మాత్రమే ప్రకటించారని తెలిపారు. మోదీ ఇచ్చే అ డబ్బును పునరావాసానికే ఖర్చు పెట్టాలన్నారు. కాంట్రాక్టర్లకు ఇస్తాను, ఇతర అవసరాలకు మళ్లిస్తానంటే కుదరదని చెప్పారు.
కాలనీల్లో ముంపు బాధితులకు సాయం అందించ లేదని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పునరావాస ప్యాకేజీ తెచ్చుకోవాల్సిన బాధ్యత జగన్ మోహన్ పై ఉందన్నారు. “నేను ఉన్నాను, నేను విన్నాను” అన్న జగన్ మోహన్ రెడ్డికి బాధితులు ఆక్రందన కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నాలుగో తేదీన విజయవాడలో మహా ధర్నా చేపట్టామని తెలిపారు.
Samul Prasad : రిటైర్డ్ ఐఆర్ఎస్ శాముల్ ప్రసాద్ ఇంట్లో చోరీ కేసులో రోజుకో మలుపు
ఐదో తేదీన చర్చలు కు రావాలని పిలిచారని, ఆరో రోజు ప్రభుత్వం స్పందన బట్టి తమ కార్యాచరణ ఉంటుందన్నారు. తాము 13 రోజులుగా పాదయాత్ర చేస్తుంటే ఎందుకు సీఎం జగన్ స్పందించలేదని ప్రశ్నించారు. పాలకులు బూతులు తిడితేనే స్పందిస్తున్నారు… వారి లాగే తాము కూడా ఇక తిడితేనే పనులు చేస్తారేమో అని పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సాయం అందించాలని కోరారు. లేకుంటే బాధితులతో కలిసి సమర శంఖం పూరిస్తామని చెప్పారు.