Bonda Uma : వైసీపీ 175కి 175 సీట్లు గెలిస్తే మాపార్టీని మూసేస్తాం : బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఉండవ అంటూ బొత్స చేసిన వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ..? హత్యలకు ప్లాన్ చేశారా..? అంటూ ప్రశ్నించారు టీడీపీ నేత బోండా ఉమ.

Bonda Uma : వైసీపీ 175కి  175 సీట్లు గెలిస్తే మాపార్టీని మూసేస్తాం : బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు

bonda uma maheshwar rao

bonda uma sensational comments..AP 2024 Elections : వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే తక్షణమే ఎన్నికలు పెట్టాలని..టీడీపీ నేత బోండా ఉమ సవాల్ చేశారు. వైనాట్ 175 అంటూ వ్యాఖ్యానించే జగన్ కు దమ్ముంటే తక్షణమే ఎన్నికలు వెళ్లాలని సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లకు 175 సీట్లు గెలిస్తే మాపార్టీని మూసేస్తాం అంటూ బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ చేస్తున్న పాదయాత్ర చూసి వైసీపీకి ముచ్చెమటలు పడుతున్నాయని అందుకే అవాంతరాలు కల్పిస్తోంది అంటూ ఆరోపించారు. తగినంత పోలీసు బందోబస్తు కూడా ఇవ్వటంలేదన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా..పోలీసు బందోబస్తు లేకపోయినా లోకేశ్ పాదయాత్ర నిరాటంకంగా జరుగుతోందని పాదయాత్రలో లోకేశ చేసే విమర్శలకు సమాధానం చెప్పలేక..ఊరుకోలేక వైసీపీ నేతలకు మింగుడు పడటంలేదు అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదన్నారు.

అలాగే వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఉండవు అంటూ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై బోండా తీవ్రంగా మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఉండవ అంటూ బొత్స చేసిన వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ..? హత్యలకు ప్లాన్ చేశారా..? అంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అని కావాలంటే రాసి పెట్టుకోండి అంటూ సవాల్ చేశారు. ఎన్నికల్లో గెలిచేది టీడీపీయేనని అధికారాన్ని చేపట్టేది టీడీపీయేనని ధీమా వ్యక్తంచేసిన బోండా ఎన్నికల్లో చీపురుపల్లినుంచి బొత్స సత్యనారాయణను ఓడిస్తాం అని అన్నారు.

Botsa Satyanarayana : వచ్చే ఉగాది నాటికి ఆ రెండు పార్టీలు ఉండవు.. పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి లేదు : మంత్రి బొత్స

ఎంతోమంది వైసీపీ నేతలు టీడీపీతో టచ్ లో ఉన్నారనీ వారిలో బొత్స సత్యనారాయణ కుటుంబ సహా 50మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. వైనాట్ 175 అంటూ భీరాలు పలికే వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే తక్షణమే ఎన్నికలు పెట్టాలని అప్పుడు తెలుస్తుంది గెలుపు ఎవరిదో అంటూ సవాల్ చేశారు. వైసీపీ ఓటమి తప్పదని ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్టులో వెల్లడించారని..అందుకే ఓటమి భయంతో వైసీపీ నేతలు ఏవేవో మాట్లాడుతున్నారని వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని గుర్తుంచుకోవాలి అంటూ బోండా ఉమ వ్యాఖ్యానించారు.

కాగా..వచ్చే అమావాస్య( ఉగాది )నాటికి తెలుగుదేశం, జనసేన పార్టీలు రెండు  ఉండవని ఉంటే గుండు గీయించుకుంటానని మంత్రి బొత్స సత్యనారాయణ  చేసిన వ్యాఖ్యలకు బోండా ఉమ మండిపడుతు..వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఉండవ అంటూ చేసిన వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ..? హత్యలకు ప్లాన్ చేశారా..? అంటూ ప్రశ్నించారు.