Covid-19 cases : ఏపీలో కరోనా కలకలం.. విశాఖలో మూడు కేసులు నమోదు

కేజీహెచ్‌, విమ్స్‌లలో ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Covid-19 cases : ఏపీలో కరోనా కలకలం.. విశాఖలో మూడు కేసులు నమోదు

CORONA

Covid-19 cases in Visakha : దేశంలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. కరోనా మరణాలు, కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఏపీలోని కరోనా కలకలం సృష్టిస్తోంది. విశాఖలో మూడు కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రోజుకు వంద మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కేజీహెచ్‌, విమ్స్‌లలో ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

తెలంగాణలో శుక్రవారం 27 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 1245 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 68 మంది నమూనాల పరీక్షలు పెండింగులో ఉన్నాయి. గురుగ్రామ్ నగరంలో కరోనా కొత్త వేరియంట్ రెండవ కేసు నమోదైంది. 42 ఏళ్ల మహిళకు శుక్రవారం కోవిడ్-పాజిటివ్ పరీక్షలు చేసినట్లు ఆరోగ్య అధికారి తెలిపారు. రాజస్థాన్‌లో కొవిడ్ -19 సంక్రమణకు సంబంధించిన ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్ రాష్ట్రంలో 683 మంది నమూనాలను పరీక్ష కోసం పంపించారు.

రాష్ట్రాలు అప్రమత్తం
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, గుజరాత్, తెలంగాణ, పంజాబ్,ఢిల్లీ ప్రాంతాల్లో కొవిడ్ కేసులు పెరిగాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ రోగుల చికిత్స కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. కొవిడ్ జేఎన్ 1 కొత్త వేరియంట్ వ్యాప్తితో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. కొవిడ్ పరీక్షల కోసం నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశించింది.

Also Read : హైదరాబాద్‌లో 14 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్… తెలంగాణలో మెల్లగా విస్తరిస్తున్న మహమ్మారి

కొవిడ్ నివారణకు అన్నీ రాష్ట్రాలు కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తున్నాయి. కొవిడ్ రోగుల్లో 93 శాతం మందికి తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆసుపత్రుల్లో 1 శాతం మంది మాత్రమే వెంటిలేటర్ సపోర్టులో ఉన్నారు. 1.2 శాతం మంది రోగులు ఐసీయూలో, 0.6 శాతం రోగులు ఆక్సిజన్ సపోర్టులో ఉన్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కొవిడ్ జేఎన్ 1 కొత్త వేరియంట్ వల్ల ప్రజారోగ్యానికి ఎక్కువ ప్రమాదం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.