Vizag ; చంద్రుడు ప్రతిష్టించిన ‘బెల్లం వినాయకుడు’ విశిష్ట చరిత్ర

పత్రం, ఫలం ఇలా దేంట్లోనైనా ఒదిగిపోతాడు. బొజ్జ గణపయ్య. ఈ వినాయక చవితి సందర్భంగా బెల్లం గణపయ్య విశిష్టత ఏంటో తెలుసుకుందాం.

Vizag ; చంద్రుడు ప్రతిష్టించిన ‘బెల్లం వినాయకుడు’ విశిష్ట చరిత్ర

Bellam Vinayaka In Vizag

Updated On : September 6, 2021 / 11:47 AM IST

Bellam Ganapathi Visistatha : సెప్టెంబర్ 10వ తేదీ వినాయక చవితి పండుగ. పత్రం, ఫలం ఇలా దేంట్లోనైనా ఒదిగిపోయే గణపయ్య ఎన్నో రూపాల్లో పూజలందుకుంటున్నాడు. ఈ వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని సాక్షాత్తు ఆ చంద్రయ్య ప్రతిష్టించిన గణపయ్య గురించి తెలుసుకుందాం. అదేనండీ చంద్రుడు ప్రతిష్టించాడని స్థలపురాణం చెబుతున్న వినాయకుడి గురించి. ఆ విశిష్ట చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇంతకీ ఈ బెల్లం వినాయకుడు ఎక్కడ పూజలందుకుంటున్నాడంటే..ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో.

బెల్లం వినాయకుడు .. గణపయ్యకు ఈ పేరు కూడా ఉందా అని ఆశ్చర్యపోతాం. విశాఖ వాసులకు ఈ బెల్లం గణపయ్య గురించి బాగా తెలుసు.అన్ని విగ్రహాలు ఒకలా ఉంటే బెల్లం వినాయకుడు మాత్రం ప్రత్యేకంగా ఉంటాడు. కనువిందు చేయటమే కాదు కల్పవల్లిగా పూజలందుకుంటున్నాడు.విశాఖపట్నం కొత్త జాలరి పేటలో వెలసిన ఈ బెల్లం వినాయకుడి విశిష్టమైన చరిత్ర ఉంది. ఈ వినాయకుడి విగ్రహాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్టించాడని చెబుతారు. ఈ విగ్రహం అన్ని రూపాలకన్నా భిన్నంగా ఉంటుంది. స్వామివారి తొండం ఇక్కడ కుడివైపు తిరిగి ఉంటుంది. ఈ బెల్లం వినాయక స్వామిని దర్శించుకుంటే ఆనందాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ బెల్లం గణపతిని అంతా ఆనంద గణపతి అని పిలుస్తారు.

ఈ గణనాథుడు కేరళ తరహాలో తాంత్రిక పూజలందుకుంటాడని పూజారులు చెబుతున్నారు. ఆనంద గణపతి పక్కనే రామలింగేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. వినాయక నవరాత్రుల్లోనే కాదు, ప్రతి బుధవారం ఈ పార్వతి తనయుడికి స్థానికులు బెల్లం సమర్పిస్తారు. అందుకే దేవాలయం చుట్టూ బెల్లం అమ్మే వర్తకులు ఉంటారు. ఉదయం ఆరు నుంచి పదకొండున్నర వరకు మళ్లీ సాయంత్రం ఐదు నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామిని దర్శించుకుంటారు.

ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దలంలో చోళరాజులు కట్టినట్లుగా చరిత్ర చెబుతోంది.ఈ దేవాలయానికి ఎదురుగా సముద్రం ఉంటుంది. ఈ సముద్ర గర్భంలో వైశాఖేశ్వరుడు పేరుతో ఉన్న ఈశ్వరుడ్ని దేవతలు ప్రతిష్టాంచారని పురాణాలు చెబుతున్నాయి. ఈశ్వరుడ్ని దేవతులు నిత్యం పూజించేవారట. కాల క్రమంలో సముద్రం ముందుకు చొచ్చుకురావటంతో వైఖాశేశ్వరుడు దేవాలయం సముద్రంలో కలిసిపోయింది. దీంతో చంద్రుడు ఎంతో వేదన చెంది శివుడి గురించి ఘోర తపస్సు చేయగా..శివుడు ప్రత్యక్ష్యమయ్యాడట.

అప్పుడు చంద్రుడు శివుడిని అయ్యా..నీ దేవాలయం సముద్రంలో కలిసిపోయింది..కాబట్టి నువ్వు ఇక్కడ వెలిసి భక్తులతో పూజలందుకోవాలని కోరాడటం..దానికి శిశుడు వినాయకుడు దేవాలయం వద్ద స్వయంభూవుగా వెలిశాడ. అప్పుడు శివుడికి గుడి కట్టిన చంద్రుడు. ఆయన కుమారుడైన వినాయకుడికి కూడా దేవాలయాన్ని నిర్మించాడట.

ఈ గణపతికి ప్రసాదంగా బెల్లం పెడతారు. అలా బెల్లం గణపతిగా పేరొందాడీ గణపయ్య. వినాయకుడి శిరస్సు ఏనుగు శిరస్సు అనే విషయం తెలిసిందే. ఏనుగుకు చెరుకు అంటే చాలా ఇష్టం అనే విషయం కూడా తెలిసిందే. అందుకే ఈ వినాయకుడికి చెరుకుతో తయారుచేసేటటువంటి బెల్లాన్ని నైవేద్యంగా పెడతారు. ఇదీ బెల్లం వినాయకుడి విశేషాలు.