Vishnukumar Raju : జగన్ పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేస్తాం : విష్ణుకుమార్ రాజు
వైసీపీ పాలనలో అవినీతి, అరాచకాలు పెరిగాయని ఆరోపించారు. రూ.2వేల నోటు రద్దు చేయాలని ఆర్బీఐకి లెటర్ రాశానని చెప్పారు.

Vishnukumar Raju
Vishnukumar Raju Charge Sheet : ఏపీ సీఎం జగన్ పై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం విధానాలను ఎండగట్టారు. జగన్ పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేస్తామని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని విమర్శించారు.
వైసీపీ పాలనలో అవినీతి, అరాచకాలు పెరిగాయని ఆరోపించారు. రూ.2వేల నోటు రద్దు చేయాలని ఆర్బీఐకి లెటర్ రాశానని చెప్పారు. రూ.2 వేల నోటు రద్దు వల్ల ఎన్నికలు నిజాయితీగా జరుగుతాయని పేర్కొన్నారు.
తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో పొత్తుల నిర్ణయంపై అధిష్టానానిదేనని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే పోటీ చేశానని చెప్పారు.