అధికార పార్టీ నేతతో అక్రమ సంబంధం… లాక్ డౌన్ టైమ్ లోనూ భర్తను అడ్డు తొలగించుకుంది.
ఆమెకు పెళ్లయింది. భర్త ఉన్నాడు. సంసారం సజావుగా సాగిపోతోంది. ఇంతలో ఆమె దారి తప్పింది. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ భార్య దారుణానికి ఒడిగట్టింది. లాక్

ఆమెకు పెళ్లయింది. భర్త ఉన్నాడు. సంసారం సజావుగా సాగిపోతోంది. ఇంతలో ఆమె దారి తప్పింది. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ భార్య దారుణానికి ఒడిగట్టింది. లాక్
ఆమెకు పెళ్లయింది. భర్త ఉన్నాడు. సంసారం సజావుగా సాగిపోతోంది. ఇంతలో ఆమె దారి తప్పింది. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ భార్య దారుణానికి ఒడిగట్టింది. లాక్ డౌన్ వేళలోనూ పక్కాగా ప్లాన్ చేసి భర్తను మర్డర్ చేయించింది. ప్రియుడితో కలిసి సినీఫక్కీలో భర్తను లారీతో గుద్దించి చంపేసింది. ఆ తర్వాత తనకేమీ తెలియనట్టు యాక్ట్ చేసింది. పోలీసులు తమదైన స్టైల్ లో విచారించడంతో అసలు నిజం వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో శనివారం(ఏప్రిల్ 4,2020) రాత్రి ఈ దారుణం జరిగింది.
రాజకీయ నేతతో రాసలీలలు:
పెద్దమండ్యం మండలం సిద్దవరం పంచాయతీ చెరువుముందరపల్లెకు చెందిన నాగలక్ష్మి, చిన్నరెడ్డెప్పల కుమారుడు బాలసుబ్రహ్మణ్యం(35). 11ఏళ్ల క్రితం మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన రేణుకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లు పట్టణంలోని కదిరి రోడ్డులో గిఫ్ట్ సెంటర్ నిర్వహించిన బాలసుబ్రహ్మణ్యం వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు.
రెండేళ్ల క్రితం తిరుపతికి వెళ్లి అక్కడ ట్రావెల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. రేణుక మాత్రం ముగ్గురు పిల్లలతో కలిసి మదనపల్లెలోనే ఉంటోంది. ఈ క్రమంలోనే ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు కె.నాగిరెడ్డితో రేణుకకు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. అతడితో రాసలీలలు సాగించేందుకు ఆ పార్టీలో మహిళా కార్యకర్తగా చేరింది.
పద్ధతి మార్చుకోవాలని భార్యను మందలించిన భర్త:
ఇటీవల బాలసుబ్రహ్మణ్యం ట్రావెల్స్ వ్యాపారం మానేసి తిరిగి మదనపల్లె వచ్చేశాడు. అక్కడే ఏదో వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భర్త తిరిగి వచ్చేయడంతో రేణుకకు ప్రియుడిని కలిసేందుకు ఇబ్బంది కలిగింది. అయినప్పటికీ పార్టీ కార్యక్రమాల పేరుతో బయటకు వెళ్లి నాగిరెడ్డితో రాసలీలలు సాగించేది.
ఈ విషయం తెలుసుకున్న భర్త పద్ధతి మార్చుకోవాలని రేణుకను హెచ్చరించాడు. ప్రియుడి మోజులో ఉన్న ఆమెకు భర్త మాటలు రుచించలేదు. దీనికి తోడు తన సుఖానికి అడ్డు పడుతున్నాడని భర్తపై కక్ష పెంచుకుంది. ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలనుకుంది.
మందులు తెచ్చుకోవాలని భర్తను బయటకు పంపిన భార్య:
తన భర్తను చంపేస్తే ఇద్దరికీ ఏ అడ్డూ ఉండదని ప్రియుడిని రేణుక రెచ్చగొట్టింది. దీంతో నాగిరెడ్డి బాలసుబ్రహ్మణ్యం హత్యకు పథకం వేశాడు. తనకు తెలిసిన వారి లారీతో ఢీకొట్టించి చంపాలనుకున్నాడు. 10 రోజులుగా అవకాశం కోసం వేచి చూస్తున్న సమయంలో శనివారం రాత్రి బాలసుబ్రహ్మణ్యానికి జలుబు ఎక్కువైంది. దీంతో రాత్రి 11గంటల సమయంలో పట్టణంలోకి వెళ్లి మాత్రలు తెచ్చుకోవాలని రేణుక భర్తను బలవంతపెట్టింది.
అవసరం లేదని చెప్పినా వినిపించుకోకుండా ప్రేమ నటిస్తూ అతడిని బయటకు పంపించింది. భర్తను బయటకు వెళ్లగానే ప్రియుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో బాలసుబ్రమణ్యం బైక్ పై వెళ్లి మందులు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా నాగిరెడ్డి లారీతో ఢీకొట్టించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలసుబ్రహ్మణ్యం స్పాట్ లోనే మరణించాడు.
సోదరుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన నిజం:
అయితే అర్ధరాత్రి సమయంలో బాలసుబ్రమణ్యం బయటకు రావడంతో స్థానికులకు అతడి మరణంపై అనుమానం వచ్చింది. మృతుడి సోదరుడు, లాయర్ అయిన రఘుపతి సైతం ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.
రేణుక, నాగిరెడ్డి మధ్య అక్రమ సంబంధం వారికి తెలిసింది. బాలసుబ్రమణ్యం బయటకు వెళ్లాక రేణుక నాగిరెడ్డికి ఫోన్ చేసినట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పథకం ప్రకారమే బాలసుబ్రహ్మణ్యంను రేణుక, ఆమె ప్రియుడు నాగిరెడ్డి మర్డర్ చేశారని తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని వాల్మీకిపురం దగ్గర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై హత్య కేసు నమోదు చేశారు.
ప్రియుడి మోజులో భర్తను భార్యే దారుణంగా చంపించిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. బాల సుబ్రహ్మణ్యం ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి చనిపోవడం, తల్లి జైలుకి వెళ్లడంతో పిల్లలు అనాథలుగా మారారు. ప్రియుడి కోసం భర్తను చంపించిన ఆ మహిళను కఠినంగా శిక్షించాలని మృతుడి బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
See Also | కిక్కు కోసం : కూల్ డ్రింకులో షేవింగ్ లోషన్ కలుపుకుని..ముగ్గురు చనిపోయారు