టీడీపీ ఎమ్మెల్యేపై రాళ్ల దాడి

విశాఖలోని అరిలోవ 13వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. ఆ ప్రాంతంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లిన టీడీపీ

  • Published By: naveen ,Published On : June 15, 2020 / 08:17 AM IST
టీడీపీ ఎమ్మెల్యేపై రాళ్ల దాడి

Updated On : June 15, 2020 / 8:17 AM IST

విశాఖలోని అరిలోవ 13వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. ఆ ప్రాంతంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లిన టీడీపీ

విశాఖలోని అరిలోవ 13వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. ఆ ప్రాంతంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లిన టీడీపీ నేత, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఎమ్మెల్యేని అడ్డుకుని దాడి:
దాడికి నిరసనగా ఎమ్మెల్యే రామకృష్ణబాబు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమపై రాళ్ల దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరు వర్గాల మధ్య వాగ్వావాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. సోమవారం(జూన్ 15,2020) అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఎమ్మెల్యే వెలగపూడి వెళ్లారు. అక్కడ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. ఈ సందర్బంగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. అదే సమయంలో ఎమ్మెల్యేపై రాళ్ల దాడి జరిగింది.