ఈ వారం రాశిఫలాలు (అక్టోబర్ 19 నుంచి 25 వరకు).. వీరికి ఆకస్మిక ధనలాభము.. డబ్బుల వర్షం కురుస్తుంది..

ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన 12 రాశుల ఫలితాల వివరాలు...

ఈ వారం రాశిఫలాలు (అక్టోబర్ 19 నుంచి 25 వరకు).. వీరికి ఆకస్మిక ధనలాభము.. డబ్బుల వర్షం కురుస్తుంది..

Updated On : October 18, 2025 / 6:02 PM IST

Horoscope: ఈ వారం రాశిఫలాలు (అక్టోబర్ 19 నుంచి 25 వరకు)
గురువు కర్కాటక రాశిలో, శని మీనరాశిలో..
వక్రస్థితి రాహుకేతువులు కుంభసింహరాశిలో
శుక్రుడు కన్యారాశిలో
కుజుడు రవిబుధులు తులా రాశిలో
చంద్రుడు సింహం కన్యా తులా వృశ్చిక రాశులలో సంచారం

మేషం: అనుకోని ప్రయాణములు, ధనలాభములు వ్యాపారంలో విభేదములు, కోర్టు సమస్యలు, చికాకు. ఆరోగ్యము కుదుట పడుతుంది. స్త్రీలతో గొడవలు, విమర్శలు, న్యాయనిపుణులను సంప్రదిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు కలుగుతాయి. దత్తాత్రేయ పారాయణము చేయటం వల్ల శుభం చేకూరుతుంది.

వృషభం: ప్రయాణములలో ప్రమాదములు, ఆకస్మిక ధనలాభము, శుభకార్య నిర్వహణ, వాగ్దానములు నెర వేరటం, ఆర్థిక నష్టాన్ని పూడ్చుకుంటారు. నూతన అగ్రిమెట్లు ఫలిస్తాయి. స్థిర ఆదాయం తగ్గుతుంది. అవివాహితులకు శుభవార్తలు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే శుభం కలుగుతుంది.

మిధునం : స్థానభ్రంశము, కార్యరంగంలో ప్రతికూలత, శత్రువృద్ధి, కుటుంబంలో సమస్యలు, అధిక ఆదాయం, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధి. అన్నింటా విజయం, మంచి నిర్ణయములు తీసుకోవడం, అధికారుల ఒత్తిడి, కోర్టు వివాదములు, నిరాశ కలుగుతుంది. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన వలన శుభఫలితాలు కలుగుతాయి

కర్కాటకం: కోపం పెరగడం, అవసరాలు తీరడం, ఉన్న విషయములలో జాగ్రత్త అవసరము, రుణబాధలు తగ్గడం, బంధుమిత్రులతో జాగ్రత్త అవసరం, వృత్తి వ్యాపార రంగాల్లో మంచి నిర్ణయములు తీసుకుంటారు. మంచి మిత్రులతో కలయిక, స్థానచలనము, ఆర్థిక ఆదాయం పెరగడం, సరైన నిర్ణయములు తీసుకుంటారు. విష్ణుసహస్రనామస్తోత్ర పారాయణం చేయటం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

సింహం : ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, వివాహ విషయంలో ఆటంకములు, సరియైన నిర్ణయము తీసుకోలేకపోవడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, సర్దుబాటుతత్వం అలవర్చుకోవాలి. అనవసరపు ఆలోచనలు చేయకూడదు, ప్రమాణంలో ఇబ్బందులు. ఇష్టదైవ ఆరాధన చేస్తే శుభ ఫలితములు వస్తాయి.

కన్యా : ప్రతి పనిలో విజయం, మానసిక ఆందోళనలు కలగకుండా చూసుకోవాలి. గౌరీరక సుఖం కార్యసిద్ధి, శుభకార్యక్రమములో పాల్గొనుట, వ్యాపారాభివృద్ధి, సుఖం, స్థిరాస్తులతో లాభం, ధనాదాయం, గౌరవ మర్యాదలు, కుటుంబంలో శుభములు. ఓం నమోనారాయణాయ నమః అష్టాక్షరి మంత్రము చదివితే శుభం కలుగుతుంది.

తులా: పుణ్యములు చేయడం, గౌరవ సన్మానములు, గృహములో శుభ కార్యక్రమములు చేయడం, యువతకు సంబంధములు కుదరడం, వృత్తి, ఉద్యోగములలో లాభములు, కార్య సానుకూలత, ధనసమృద్ధి, విద్యార్థులకు అనుకూలం, ఉన్నతమైన అభిప్రాయములు పెరగడం, అమ్మవారి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

వృశ్చికం: ధన విషయంలో జాగ్రత్త అవసరము. వాత సంబంధ వ్యాధులు, భయము, బలహీనత, అనారోగ్యము, శుభకార్యక్రమములు చేయడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం. వ్యాపారంలో చికాకులు, ఉద్యోగంలో అధికారుల ఆగ్రహానికి గురికావడం. గణపతి ఆరాధన చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి.

ధనస్సు: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ధనలాభము, వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి, రుణ బాధలు తగ్గడం, మంచి ఆలోచనలు కలగడం, నూతన వ్యాపారములు, ప్రయాణముల వల్ల లాభములు. శుభకార్య నిర్వాహణ. అనుకోని ప్రయాణములు, స్త్రీలతో గొడవలు, కొద్ది వివాదములు. గకార అష్టోత్తరముతో గణపతి ఆరాధన చేస్తే శుభఫలితములు కలుగుతాయి.

మకరం: అనవసరపు విషయములలో జ్యోక్యం పనికిరాదు. ఆవేశం తగ్గించుకోవాలి. ప్రతివిషయంలో రాజీ అవసరము. ఆర్థిక లాభములు, గృహనిర్మాణము, గృహమరమ్మతులు, శుభకార్యాది క్రమములు, ప్రయాణములలో జాగ్రత్త అవసరం, వృత్తి వ్యాపారములలో అభివృద్ధి, చికాకులు, బంధుమిత్రలతో సహనంగా ఉండాలి. ఇష్ట దైవ ఆరాధన చేస్తే ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

కుంభం: మనఃశాంతి కలగడం, అధిక ప్రయాణములు, తీర్థయాత్రలు, నదీస్నానము, అకస్మిక ధనలాభము, ఆకస్మిక ప్రయాణములు ఉదర సంబంధ వ్యాధులు, ఉద్యోగ భద్రత అవసరము, శ్రమకు గుర్తింపు, అనేక మార్గములలో ఆదాయం, పెండింగ్ పనులు అన్నీ వేగంగా పూర్తి అవుతాయి. నూతన ఆభరణములు కొనుగోలు చేయడం. రాజకీయ వ్యవహారములలో జయము. శ్రీ సుబ్రహ్మణేశ్వరస్వామి ఆరాధన చేయడం వల్ల మంచి ఫతములు కలుగుతాయి.

మీనం: ధననష్టం, వృథా ప్రయాణములు, చికాకులు, అలసట, వస్తువుల కొనుగోలు, స్త్రీలకు నూతన అవకాశములు, స్థిరాస్తి పెరగడం, ధనధాన్య సమృద్ధి, విద్యార్థులకు అనుకూలము. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితములు పొందుతారు.

BrahmaSRI DR Nayakanti Mallikarjuna Sharma

పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ

Ph: 9849280956, 9515900956