Flipkart Winter Fest Sale : ఫ్లిప్కార్ట్ వింటర్ ఫెస్ట్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 14, మోటోరోలా ఎడ్జ్ 40పై భారీ డిస్కౌంట్లు..!
Flipkart Winter Fest Sale : ఫ్లిప్కార్ట్ కొత్త వింటర్ ఫెస్ట్ సేల్ను నిర్వహిస్తోంది. మోటోరోలా ఎడ్జ్ నియో 40, ఐఫోన్ 14, రెడ్మి 12 సిరీస్ వంటి అనేక 5జీ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. ధర వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart Winter Fest Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫారమ్లో కొత్త వింటర్ ఫెస్ట్ సేల్ను నిర్వహిస్తోంది. మోటోరోలా ఎడ్జ్ నియో 40, ఐఫోన్ 14, రెడ్మి 12 సిరీస్ వంటి అనేక 5జీ ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఈ సేల్ ఇప్పటికే ఇ-కామర్స్ సైట్లో అందుబాటులో ఉంది. డిసెంబర్ 31 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. లేటెస్ట్ ఫ్లిప్కార్ట్ ఫెస్ట్ 2023 చివరి సేల్ సందర్భంగా కొత్త ఫోన్లను కొనుగోలు చేయాలని భావించే వారు తగ్గింపుతో పొందవచ్చు. ఈ ఫోన్లపై ఫ్లిప్కార్ట్ వింటర్ ఫెస్ట్ సేల్ డీల్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్ 14, మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్లపై డిస్కౌంట్లు :
ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫారమ్లో ఐఫోన్ 14 రూ. 57,999కి లిస్టు అయింది. గతేడాదిలో రూ.89,900 ప్రారంభ ధరతో ప్రకటించిన ఐఫోన్ 14 ప్లస్ ప్రస్తుతం చాలా తక్కువ ధరకే విక్రయిస్తోంది. ఈ డివైజ్ ఫ్లిప్కార్ట్ ద్వారా రూ.65,999 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్పై రూ. 23,901 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఎలాంటి నిబంధనలు లేదా షరతులు లేకుండా 128జీబీ స్టోరేజ్ మోడల్ ఇదే ధరకు సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 14 సిరీస్ స్టాండర్డ్, ప్రోతో పోలిస్తే.. భారీ బ్యాటరీ, డిస్ప్లేను కలిగి ఉంది. ఇతర మోడళ్లతో పోల్చితే.. ఐఫోన్ 14 ప్లస్లో అత్యుత్తమ బ్యాటరీ లైఫ్ కూడా అందిస్తుంది. ఈ కొత్త ఐఫోన్ 15 కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు రూ. 77,900కు పొందవచ్చు. ఐఫోన్ 15 రూ. 74,900కి లిస్టు కావడంతో వినియోగదారులు అమెజాన్లో అద్భుమైన డీల్ను పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ కూడా అమ్మకానికి ఉంది. ఈ స్మార్ట్ఫోన్ను రూ. 11,990కి కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ 12,990 నుంచి పడిపోయింది.
ఇతర 5జీ ఫోన్లపై మరిన్ని డిస్కౌంట్లు :
మిడ్-రేంజ్ మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఫ్లిప్కార్ట్ వింటర్ ఫెస్ట్ సేల్ సమయంలో రూ.22,999కి అందుబాటులో ఉంది. వివో టీ2 5జీని రూ. 16,999కి కొనుగోలు చేయవచ్చు. రెడ్మి నోట్ 12 ప్రో స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలనుకునే వారు రూ.21,999కి పొందవచ్చు. ఫ్లిప్కార్ట్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీని రూ. 18,499కి విక్రయిస్తోంది. అయితే, పోకో ఎం6 ప్రో 5జీ ప్రారంభ ధర రూ. 10,999తో లభిస్తుంది. పిక్సెల్ 7ఎ, పోకో ఎక్స్5 ప్రో వరుసగా రూ. 38,999, రూ. 16,999 తగ్గింపు ధరలో అమ్మకానికి ఉన్నాయి.