Gautam Adani : ప్రపంచ టాప్ 20 సంపన్నుల జాబితాలోకి గౌతమ్ అదానీ రీఎంట్రీ..!

Gautam Adani : గౌతమ్ అదానీ రీఎంట్రీ అదిరింది.. ఒక్కరోజే లక్ష కోట్ల సంపాదనతో మళ్లీ టాప్ 20 సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Gautam Adani : ప్రపంచ టాప్ 20 సంపన్నుల జాబితాలోకి గౌతమ్ అదానీ రీఎంట్రీ..!

Gautam Adani back in world’s top 20 richest billionaires list

Gautam Adani : ప్రముఖ దేశీయ వ్యాపారవేత్త, భారతీయ బిలియనీర్, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మళ్లీ తన స్థానాన్ని తిరిగి పొందారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా పుంజుకోవడంతో ఆయన టాప్ 20 సంపన్నుల జాబితాలో మళ్లీ చోటు దక్కించున్నారు. అదానీ కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ రూ.1.33 లక్షల కోట్లకు పెరగడంతో సింగిల్ డేలోనే అదానీ సంపద రూ.లక్ష కోట్లకు పెరిగినట్టు నివేదిక వెల్లడించింది.

తద్వారా ఆయన ప్రపంచంలోని టాప్ 20 సంపన్నుల జాబితాలో నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. అదానీ 19వ స్థానాన్ని కలిగి ఉన్నారు. తన మొత్తం నికర విలువలో 6.5 బిలియన్ డాలర్లు పెరిగినట్టు తెలిపింది. అయినప్పటికీ, అదానీ మొత్తం నికర విలువ సంవత్సరానికి 53.8 బిలియన్ డాలర్లు తక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది.

Read Also : Indian Mobile Users : 70 లక్షల భారతీయ యూజర్ల మొబైల్ నెంబర్లు బ్లాక్.. మీ నెంబర్ సేఫ్‌గా ఉండాలంటే ఈ తప్పు అసలు చేయొద్దు!

అంబానీ తర్వాత రెండో స్థానంలో అదానీ :
అదానీ గ్రూప్‌పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దర్యాప్తుపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల తర్వాత అదానీ కంపెనీలు మొత్తం పది స్టాక్‌లలో భారీగా ర్యాలీని చవిచూశాయి. ఇది ఈ స్టాక్‌లపై పెట్టుబడిదారుల ఆసక్తిని గణనీయంగా పెంచింది. అన్ని అదానీ గ్రూప్ స్టాక్‌ల సామూహిక మార్కెట్ క్యాప్ బుధవారం రూ.33వేల కోట్లకు పైగా పెరిగి రూ.11.6 లక్షల కోట్లకు చేరుకుందని నివేదిక పేర్కొంది. 89.5 బిలియన్ డాలర్ల మొత్తం నికర విలువ కలిగిన ముఖేష్ అంబానీ తర్వాత ఆ జాబితాలో అదానీ రెండో సంపన్న భారతీయుడిగా నిలిచారు.

Gautam Adani back in world’s top 20 richest billionaires list

Gautam Adani

హిండెన్‌బర్గ్ నివేదికతో భారీగా పతనం :
ఈ సంవత్సరం ప్రారంభంలో హిండెన్‌బర్గ్ పరిశోధన నివేదికతో భారీగా పతనమైన అదానీ ర్యాంకింగ్ 25వ స్థానం కన్నా దిగువకు పడిపోయింది. ఇటీవల సుప్రీం కోర్టు పరిశీలనలు అదానీ గ్రూప్‌పై మార్కెట్ రెగ్యులేటర్ విచారణను ప్రశ్నించడానికి ఎలాంటి కారణం లేదని సూచించింది. మార్కెట్ రెగ్యులేటర్ చర్యలను ప్రశ్నించడానికి తమకు ఎలాంటి ఆధారం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

దాంతో హిండెన్‌బర్గ్ నివేదికను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదని సుప్రీం స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మార్కెట్ అస్థిరత లేదా షార్ట్ సెల్లింగ్ నుంచి పెట్టుబడిదారులను రక్షించడానికి ప్రణాళికల గురించి సెబిని ప్రశ్నించింది. గణనీయమైన సాక్ష్యాలు లేకుండా కోర్టు స్వతంత్రంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయలేదని పేర్కొంది.

టాప్ 20 జాబితాలో ఇంకా ఎవరున్నారంటే? :
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రపంచంలోని టాప్ రేంజ్ 500 మంది సంపన్నుల జాబితాలో నికర విలువను పర్యవేక్షిస్తుంది. టెస్లా అధినేత ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అదానీ అంబానీలతో పాటు, షాపూర్ మిస్త్రీ, శివ్ నాడార్, సావిత్రి జిందాల్, అజీమ్ ప్రేమ్‌జీ, రాధాకిషన్ దమానీ, ఉదయ్ కోటక్‌లతో సహా 20 మంది భారతీయులు ఈ సంపన్నుల జాబితాలో ఉన్నారు.

Read Also : OnePlus Nord CE 3 5G : భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ఫోన్ ధర తగ్గిందోచ్.. ఇప్పుడు ఎంతో తెలుసా?