Gold Price: ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి గోల్డ్ రేటు.. హైదరాబాద్, విజయవాడలో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇక్కడ తెలుసుకోండి..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.

Gold
Gold And Silver Price: బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ నేపథ్యంలో గోల్డ్ రేటు భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో గడిచిన మూడు రోజుల్లో గతంలో ఎప్పుడు లేనంత స్థాయిలో ధరలు పెరిగాయి.. ఫలితంగా భారతదేశంలో గోల్డ్ రేటు సరికొత్త రికార్డులను నమోదు చేసింది.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ. 2020 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 1,850 పెరిగింది. దీంతో బంగారం ధర 96వేల మార్క్ కు చేరుకొని సరికొత్త రికార్డులను నమోదు చేసింది. మరోవైపు గడిచిన మూడు రోజుల్లోనే 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.5,670 పెరుగుదల చోటు చేసుకుంది. మరోవైపు వెండి ధరకూడా పెరిగింది. ఇవాళ కిలో వెండి ధర రూ. వెయ్యి పెరగ్గా.. రెండు రోజుల్లో కిలో వెండిపై రూ.6వేలు పెరుగుదల చోటు చేసుకుంది.
అంతర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఔన్సు (31.10గ్రాముల) బంగారం ధర అంతర్జాతీయ విపణిలో గురువారం 3,164డాలర్ల వద్ద కొనసాగగా.. శుక్రవారం ఉదయంకు 3,208 డాలర్లకు చేరింది. మరోవైపు ఔన్స్ సిల్వర్ ధర స్వల్పంగా పెరిగి 31.17 డాలర్ల వద్ద ట్రేడవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.87,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.95,400కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ.95,550కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 87,450 కాగా.. 24క్యారెట్ల ధర రూ.95,400 గా నమోదైంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,08,000కు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.97,100గా నమోదైంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,08,000 కు చేరింది.
Note: పైన పేర్కొన్న ధరలు ఉదయం 10గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరలు రోజులో అనేక దఫాలుగా మారుతుంటాయి. ఖచ్చితమైన ధరల కోసం నగల దుకాణంలో లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి.