Gold and silver Price: రూ.80వేలకు చేరువలో బంగారం ధర.. మరోసారి లక్ష దాటిన వెండి.. ఎందుకలా పెరుగుతున్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర

Gold and silver Price: రూ.80వేలకు చేరువలో బంగారం ధర.. మరోసారి లక్ష దాటిన వెండి.. ఎందుకలా పెరుగుతున్నాయంటే?

Gold

Updated On : September 25, 2024 / 11:15 AM IST

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 2,570 పెరగ్గా.. కిలో వెండిపై రూ. 5వేలు పెరిగింది. బంగారం, వెండి ధరలు భారీగా పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం. వడ్డీ రేట్లు తగ్గించడంతో అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో దేశంలోనూ బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అదేవిధంగా దేశీయంగా నవరాత్రి, దీపావళితోపాటు పండుగల సీజన్ కారణంగా బంగారం ధరలు పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Gold
బుధవారం బంగారం ధర పెరిగింది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 660 పెరగ్గా.. కిలో వెండి ధర రూ. 3వేలు పెరిగింది. దీంతో 24 క్యారట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.80వేలకు చేరువ కాగా.. కిలో వెండి ధర మరోసారి రూ. లక్ష దాటింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

Gold
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,600 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.77,020కు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,750 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 77,170.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.70,600 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.77,020.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 70,600 కాగా.. 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.77,020కు చేరింది.

Gold
వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా బుధవారం వెండి ధర భారీగా పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,01,000కు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,01,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండిపై రూ. 2వేలు పెరిగింది. దీంతో అ నగరాల్లో కిలో వెండి రేటు రూ. 95,000 వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో కిలో వెండి ధర 87,000 వద్ద కొనసాగుతుంది.

Gold
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.