Gold Rate : మే నెలలో గోల్డ్ రేటు భారీగా పెరగనుందా? తెలుగు రాష్ట్రాల్లో మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో..

Gold Rate : మే నెలలో గోల్డ్ రేటు భారీగా పెరగనుందా? తెలుగు రాష్ట్రాల్లో మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold

Gold And Silver Price : మే నెలలో బంగారం ధరలు భారీగా పెరగనున్నాయా? ప్రస్తుతం ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నబంగారం ధరలతో బెంబేలెత్తిపోతున్న కొనుగోలుదారులకు.. గోల్డ్ రేటు మరింత షాకివ్వనుందా..! నిపుణుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. అంతర్జాతీయంగా బంగారంకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో దేశంలోనూ గోల్డ్ రేటు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా మే నెలలో వీటి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర గురువారం భారీగా పెరిగింది. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 700 పెరిగింది. మరోవైపు వెండి ధరసైతం పెరిగింది. కిలో వెండిపై రూ. 500 పెరిగింది.

 

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,250 వద్దకు చేరుకోగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,270 వద్దకు చేరింది.

 

  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,420.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.66,250 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,270.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,150 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.73,250.

 

  • భారీగా పెరిగిన వెండి ధర ..
    దేశ వ్యాప్తంగా వెండి ధర పెరిగింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.87,000 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 87,000. కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.83,500 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 1,150 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 82,250 వద్ద కొనసాగుతుంది.

 

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.