Gold Price Today: బంగారం ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లోనూ వరుసగా మూడోరోజు బంగారం ధర తగ్గింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..

Gold Price Today: బంగారం ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా?

Gold Price

Updated On : November 2, 2023 / 7:19 AM IST

Today Gold and Silver Rate : భారత్ బులియన్ మార్కెట్ లో బంగారం ధర క్రమంగా తగ్గుతోంది. గత మూడు రోజుల ముందువరకు భారీగా పెరిగిన బంగారం ధరలు.. మూడు రోజులుగా కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. పండుగల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండటంతో ఊరట కలిగించే అంశం. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 300, అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంపై రూ. 320 తగ్గింది. అయితే, గత మూడు రోజులుగా 10 గ్రాముల బంగారంపై రూ. వెయ్యి మేర తగ్గింది.

Gold

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లోనూ వరుసగా మూడోరోజు బంగారం ధర తగ్గింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 56,400 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 61,530కు చేరుకుంది.

Gold

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 61,680 కి చేరింది.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 56,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,530 కు చేరింది.
– చెన్నైలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ. 290 తగ్గగా.. 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 320 తగ్గింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,860కి తగ్గగా, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,030 కు చేరింది.

భారీగా తగ్గిన వెండి ధర ..
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 1200 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 77,000కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,000. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.74,100 వద్దకు చేరింది. బెంగళూరులో మాత్రం వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. దీంతో అక్కడ కిలో వెండి రూ.74,000 వద్ద కొనసాగుతుంది.