మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌, విజయవాడలో ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి.

మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌, విజయవాడలో ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Prices

Updated On : December 5, 2025 / 12:07 PM IST

Gold Prices: దేశంలో ఇవాళ ఉదయం బంగారం ధర మళ్లీ పెరిగింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.270 పెరిగి రూ.1,29,930గా ఉంది.

అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.1,19,100గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.210 పెరిగి రూ.97,450గా ఉంది. (Gold Prices)

ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగి రూ.1,30,080గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.1,19,250గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.210 పెరిగి రూ.97,600గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.270 పెరిగి రూ.1,29,930గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.1,19,100గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.210 పెరిగి రూ.97,450గా ఉంది.

Also Read: RBI: గుడ్‌న్యూస్‌.. రెపో రేటు తగ్గింది.. EMIలు తగ్గుతాయ్‌..

వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం మూడు నగరాల్లో కిలో వెండి ధర రూ.4,000 తగ్గి రూ.1,96,900గా ఉంది.

ఢిల్లీ నగరంలో వెండి ధరలు కిలోకి రూ.4000 చొప్పున తగ్గాయి. కిలో వెండి ధర రూ.1,87,000గా ఉంది. ముంబైలోనూ కిలో వెండి ధర రూ.1,87,000గా ఉంది.