Mohini Mohan Dutta : రతన్ టాటా వీలునామాలో షాకింగ్ పేరు? ఎవరీ మోహిని మోహన్ దత్తా.. ఈ మిస్టరీ మ్యాన్‌కు రూ. 500 కోట్లు రాసిచ్చాడు!

Mohini Mohan Dutta: 80 ఏళ్ల మోహిని మోహన్ దత్తా, 1960లో మొదటిసారి రతన్ టాటాను కలిశారు. 24ఏళ్ల వయస్సులో టాటా డీలర్స్ హాస్టల్‌లో కలుసుకున్నారు. టాటాతో పరిచయం దత్తా జీవితాన్నే పూర్తిగా మార్చివేసింది.

Mohini Mohan Dutta : రతన్ టాటా వీలునామాలో షాకింగ్ పేరు? ఎవరీ మోహిని మోహన్ దత్తా.. ఈ మిస్టరీ మ్యాన్‌కు రూ. 500 కోట్లు రాసిచ్చాడు!

Mohini Mohan Dutta

Updated On : February 7, 2025 / 2:16 PM IST

Mohini Mohan Dutta : ప్రముఖ టాటా గ్రూప్ దిగ్గజం దివంగత రతన్ టాటా వీలునామా మరోసారి వార్తల్లో నిలిచింది. ఆయన వీలునామాలో చేర్చిన పేరు టాటా ఆ కుటుంబాన్ని మాత్రమే కాకుండా మొత్తం వ్యాపార ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ పేరు జంషెడ్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త మోహిని మోహన్ దత్తా. రతన్ టాటా తన వీలునామాలో దాదాపు రూ. 500 కోట్లు తనకు విరాళంగా ఇస్తానని చెప్పారని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇంతకీ మోహిని మోహన్ దత్తా ఎవరు, రతన్ టాటాతో ఈయనకు ఉన్న సంబంధం ఏంటి? రతన్ టాటా వీలునామాలో ఈయన పేరు ఎందుకు ఉంది? ప్రతి ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : మీకు జీతం తక్కువగా వస్తుందా? ఇలా పెట్టుబడి పెట్టండి చాలు.. లైఫ్ మొత్తం హ్యాపీగా బతికేయొచ్చు..!

దివంగత వ్యాపార దిగ్గజం రతన్ టాటా తన ఆస్తులలో దాదాపు మూడింట ఒక వంతును ఒక రహస్య వ్యక్తి కోసం వదిలి వెళ్ళాడు. అక్టోబర్ 9, 2024న మరణించిన రతన్ టాటా.. రూ. 500 కోట్ల విలువైన ఆస్తులను మోహిని మోహన్ దత్తాకు అప్పగించారని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. మోహిని మోహన్ దత్తా కుటుంబానికి లేదా బిలియనీర్-దాత సన్నిహితులకు అంతగా తెలియని వ్యక్తిగా ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. వాస్తవానికి, టాటా సంపదకు దత్తాను వారసులలో ఒకరిగా వీలునామాలో పేర్కొన్నప్పటికీ, అది ప్రొబేట్ చేయించుకుని హైకోర్టు ధృవీకరించిన తర్వాత మాత్రమే పంపిణీ చేసే వీలుంది. దీనికి కనీసం 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

మోహినీ మోహన్ దత్తా ఎవరంటే? :
జంషెడ్‌పూర్‌కు చెందిన వ్యవస్థాపకుడు మోహిని మోహన్ దత్తా.. స్టాలియన్‌కు సహ యజమాని కూడా. ఆ తరువాత టాటా సర్వీసెస్‌లో ఇది భాగమైంది. రతన్ టాటా విలీనానికి ముందు.. దత్తా స్టాలియన్‌లో 80శాతం వాటాను కలిగి ఉండగా, టాటా ఇండస్ట్రీస్ మిగిలిన 20శాతం వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం 80 ఏళ్లు పైబడిన మోహిని మోహన్ దత్తా.. 1960లలో మొదటిసారి రతన్ టాటాను కలిశారు. ఆ సమయంలో, 24 ఏళ్ల వయస్సులో టాటా తన టాటా స్టీల్‌లో పనిచేశాడు.

ఆ సమయంలో ఆయన డీలర్స్ హాస్టల్‌లో దత్తాను కలిశాడు. అదే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. 2024 అక్టోబర్‌లో టాటా అంత్యక్రియల సందర్భంగా దత్తా ఆయనను గుర్తుచేసుకున్నారు. “మేం మొదట జంషెడ్‌పూర్‌లోని డీలర్స్ హాస్టల్‌లో కలిశాం. అప్పుడు రతన్ టాటా వయసు కేవలం 24 సంవత్సరాలు. ఆయన నాకు ఎంతో సాయం చేసి ఇంత వాడిని చేశారు” అని గతంలో దత్తా మీడియాతో అన్నారు. ఈ తొలి పరిచయం రతన్ టాటా, మోహిని మోహన్ దత్తా ఇద్దరి మధ్య ఆత్మీయ అనుబంధంగా మారింది.

దత్తాకు టాటాతో 6 దశాబ్దాల అనుబంధం :
రతన్ టాటా తన వీలునామాలో దత్తా పేరు కనిపించే ముందు ఆయన గురించి ఎవరికి తెలియదు. కానీ ఆ వ్యవస్థాపకుడు ఎల్లప్పుడూ తన కుటుంబానికి దగ్గరగా ఉండేవాడని టాటా గ్రూప్ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. టాటాతో దాదాపు 6 దశాబ్దాల అనుబంధం ఉందని భావిస్తున్న దత్తా.. డిసెంబర్ 2024లో ముంబైలోని (NCPA)లో జరిగిన రతన్ టాటా జయంతి వేడుకలకు ఆహ్వానితులుగా ఉన్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఫార్చ్యూన్‌లో నివేదిక ప్రకారం.. దత్తా కుమార్తె కూడా వారితో కలిసి పనిచేసింది. మొదట 2015 వరకు తాజ్ హోటల్స్‌లో పనిచేయగా ఆ తరువాత 2024 వరకు టాటా ట్రస్ట్స్‌లో పనిచేసింది.

రతన్ టాటా వీలునామా :
టాటా మరణించిన దాదాపు రెండు వారాల తర్వాత ఆయన వీలునామాను బహిరంగంగా ఉంచారు. ఈ వీలునామాలో ఆయన సోదరుడు, సవతి సోదరీమణులు, నమ్మకంగా పనిచేసే ఇంటి సిబ్బంది, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శాంతను నాయుడు వంటి అనేక మంది లబ్ధిదారులకు సంపదను కేటాయించారు. తన పెంపుడు కుక్క టిటోకు అపరిమిత సంరక్షణ ఉండేలా టాటా అనేక నిబంధనలు కూడా చేశారు. టాటా సన్స్‌లోని వాటాలను రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్‌కు బదిలీ చేశారు. తన ఆస్తులలో అలీబాగ్‌లోని బీచ్ బంగ్లా, జుహులో రెండంతస్తుల ఇల్లు, రూ. 350 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, టాటా సన్స్‌లో వాటా ఉన్నాయి.

Read Also : Poco X6 5G : భలే ఉంది భయ్యా ఫోన్.. రూ. 6వేలకే పోకో 5జీ ఫోన్ అంట.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

అప్పట్లో దత్తాకు సొంత వెంచర్ :
దత్తా తన కెరీర్‌ను తాజ్ గ్రూప్‌తో ప్రారంభించారు. ఆ తర్వాత తన సొంత వెంచర్ స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించారు. 2013లో తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ విభాగమైన తాజ్ సర్వీసెస్‌తో విలీనం అయ్యింది. దాంతో ఈ వ్యాపారంలో 80శాతం వాటాను కలిగి ఉన్నారు. మిగిలినది టాటా ఇండస్ట్రీస్ వద్ద ఉంది. ఆ ఏజెన్సీ తరువాత తాజ్ ట్రావెల్ డివిజన్‌లో విలీనం అయింది. ఆ తరువాత దీనిని టాటా క్యాపిటల్ కొనుగోలు చేసింది. ఆ తరువాత థామస్ కుక్ (ఇండియా)కు అమ్మేశారు. ఇప్పుడు టీసీ ట్రావెల్ సర్వీసెస్‌గా పనిచేస్తున్న దత్తా డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయన టాటా గ్రూప్ కంపెనీలలో వాటాలు కూడా ఉన్నాయి. అందులో త్వరలో లిస్టెడ్ కాబోయే టాటా క్యాపిటల్ కూడా ఉంది.