NPS to UPS Deadline : NPS నుంచి UPSకి ఇంకా మారలేదా? డెడ్లైన్ పొడిగించే ఛాన్స్ ఉందా? వన్ షాట్ ఆన్సర్..!
NPS to UPS Deadline : నేషనల్ పెన్షన్ సిస్టమ్ నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కు మారేందుకు చివరి తేదీ నవంబర్ 30, 2025. ఈ గడువును పొడిగింపుపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కొత్త ప్రకటన చేయలేదు.
NPS to UPS Deadline
NPS to UPS Deadline : నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)కు మారేందుకు చివరి తేదీ 30 నవంబర్ 2025. ఇప్పటివరకు ఈ గడువు పొడిగింపుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కొత్త ప్రకటన చేయలేదు. అంటే.. ఇచ్చిన గడువులోగా UPS ఎంచుకోని ఉద్యోగులు ఈ కొత్త పథకంలో చేరలేరు.
గడువు ముగిసిన తర్వాత ఏదైనా (NPS to UPS Deadline) పొడిగింపు ఉంటుందా లేదా అనే ప్రశ్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో తలెత్తుతోంది. కానీ, ప్రస్తుతం అలాంటిదేమీ లేదు. ఈ ఏడాదిలో యూపీఎస్ ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. NPSతో పోలిస్తే మరింత స్థిరమైన గ్యారెంటీ పెన్షన్ అందిస్తుంది.
NPS వివరాలేంటి? :
ఎన్పీఎస్ మార్కెట్ ఆధారిత రిటర్న్ సిస్టమ్కు బదులుగా గ్యారెంటీ నెలవారీ పెన్షన్ కోరుకునే ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూపీఎస్ ప్రత్యేకంగా రూపొందించారు. ఈ కొత్త పథకం కింద ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనం డీఏలో 10శాతం వాటాను చెల్లిస్తారు. ప్రభుత్వం సమాన మొత్తాన్ని అందజేస్తుంది.
అదనంగా, భవిష్యత్తులో పెన్షన్ చెల్లింపులు సజావుగా జరిగేలా ప్రభుత్వం ‘పూల్ కార్పస్’ ఫండ్ సుమారు 8.5శాతం వాటాను అందిస్తుంది. అయితే, నిర్ణీత సమయంలోపు యూపీఎస్కు మారని ఉద్యోగులు ఇప్పుడు డిఫాల్ట్గా NPS కింద పరిగణనలోకి తీసుకుంటారు. పాత పథకం నుంచి నిష్క్రమించలేరు.
యూపీఎస్లో పెన్షన్ లెక్కింపు :
యూపీఎస్ కింద పెన్షన్ లెక్కింపు చాలా ఈజీ. ఉద్యోగి కనీసం 25 ఏళ్లు పనిచేస్తేనే పూర్తి పెన్షన్ బెనిఫిట్ లభిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో రిటైర్మెంట్కు ముందు ఉద్యోగి సగటు ప్రాథమిక జీతంలో (12 నెలలు) పెన్షన్ 50 శాతం ఉంటుంది. తక్కువ సర్వీస్ పీరియడ్లు ఉన్న ఉద్యోగులు దామాషా పెన్షన్ పొందుతారు.
ఇంకా, 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులు నెలకు కనీసం రూ. 10వేలు గ్యారెంటీ పెన్షన్ పొందుతారు. పాక్షిక విత్డ్రా చేయకుండా స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకునే వారు కూడా సాధారణంగా పదవీ విరమణ చేసే వయస్సు నుంచి పెన్షన్ పొందుతారు.
యూపీఎస్, ఎన్పీఎస్ పన్ను విధానం :
యూపీఎస్ టాక్స్ అనేది ఎన్పీఎస్ మాదిరిగానే ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80CCD(1) ప్రకారం.. ఉద్యోగులు పన్ను మినహాయింపుకు అర్హులు. ప్రాథమిక, వ్యక్తిగత ఆదాయ పన్ను (DA)లో 10శాతం వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా అందిస్తుంది.
కానీ, గడువును పొడిగించకపోవడం వల్ల చాలా మంది ఉద్యోగులు చివరి రోజుల్లో నిర్ణయం తీసుకోలేకపోయారు. తమ ఆప్షన్ సమర్పించలేకపోయారు. ప్రస్తుతం, కొత్త విండోను ఓపెన్ చేయలేదు. UPS గడువు తేదీ కూడా పొడిగించలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. నవంబర్ 30, 2025కి ముందు ఈ ఆప్షన్ ఎంచుకున్న ఉద్యోగులు మాత్రమే UPS బెనిఫిట్స్ పొందగలరు.
