Yes Bank లో చిక్కుకున్న పూరీ జగన్నాథుడి రూ.547 కోట్ల డిపాజిట్లు

ప్రసిధ్ధ పుణ్యక్షేత్రం ఒడిషాలోని పూరి జగన్నాధస్వామి ఆలయానికి చెందిన సుమారు రూ.547 కోట్ల రూపాయలు సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ లో ఉండిపోయాయి. ఒక ప్రయివేటు బ్యాంకులో ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్లు ఉంచటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ మార్గదర్శకాలను ఉల్లంఘించి డిపాజిట్లు చేశారని దీనిపై దర్యాప్తు జరపాలని ఆలయకమిటీ సభ్యులు కోరుతున్నారు.
ప్రైవేటు బ్యాంకుతో ఇంత భారీ నిధులను ఉంచే నిర్ణయం జాతీయం చేసిన బ్యాంకుల్లో డిపాజిట్లు ఉంచడానికి మార్గదర్శకాలను ఉల్లంఘిస్తోందని, దీనిపై దర్యాప్తు జరపాలని ఆలయ సంఘం సభ్యులు తెలిపారు.ఇటీవలే బ్యాంకు రూ.47 కోట్లను విత్ డ్రా చేసింది అయినప్పటికీ ఇంకా రూ.547 కోట్లు బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయి.
బ్యాంకు ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోవటంతో రిజర్వ్ బ్యాంక్ యస్ బ్యాంకు నుంచి నగదు ఉపసంహరణపై పరిమితులు విధించటంతో ఇప్పుడు ఆలయ నిధులపై అనిశ్చితి నెలకొంది. మార్చి నెలలో మెచ్యురిటీ అయ్యే డిపాజిట్లను విత్ డ్రా చేసివాటిని తిరిగి జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని గత నెలలో జరిగిన దేవస్ధానం పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు.
దీంతో ఆలయ అధికారులు బ్యాంకును సంప్రదించగా మార్చి 19, 23, మరియు 29 తేదీల్లో మెచ్యురైన మొత్తాన్ని చెల్లిస్తామని బ్యాంకు అధికారుల తెలిపారు. కానీ ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు ఆంక్షలు విధించంటంతో మెచ్యురైన డిపాజిట్ల పై అనిశ్చితి నెలకొంది. ఈ చర్యపై ఆలయ కమిటిలోని కొందరు సభ్యులు తీవ్రంగా విమర్శించారు.
కాగా ఆలయానికిసంబంధించిన డిపాజిట్లు తిరిగి వచ్చేలా ప్రభుత్వంలో మాట్లాడి ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకుంటామని మాజీ రెవెన్యూ మంత్రి, బిజెడి నాయకుడు మహేశ్వర్ మొహంతి చెప్పారు . ఇటీవలే యస్ బ్యాంకులో డిపాజిట్ చేసిన తిరుమల వెంకన్నకు చెందిన సుమారు.రూ.1300 కోట్లను కొద్ది నెలల కిందటే ఉపసంహరించుకున్నారు.