హుక్కా పొగలు , వైన్ సెగలతో రేవ్ పార్టీ క్లైమాక్స్లో ఉండగా పోలీసులు ఎంటర్

దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ నిబంధనలు అతిక్రమించి ఓ క్లబ్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కోవిడ్-19 వ్యాపిస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున యువతీ యువకులు గుమికూడటంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. పశ్చిమ్ విహార్ ప్రాంతంలోని ప్లాగ్ క్లబ్లో రేవ్ పార్టీ జరుగుతోందనే పక్కా సమాచారం తో పోలీసులు క్లబ్ పై దాడి చేశారు.
ఈ దాడిలో అక్కడ పార్టీకి హాజరైన ఏడుగురు యువతులతో సహా 31 మందిని అరెస్ట్ చేశారు. క్లబ్ యజమాని లావిష్ ఖురానా , అతని సోదరుడు ఖాషిష్ ఖురానాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ బ్రాండ్లకు చెందిన 11 మద్యం బాటిళ్లు,77 బీరు సీసాలు, 8 హుక్కాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం రాత్రి ఈ పార్టీ జరగ్గా, పోలీసులు దాడి చేసిన సమయంలో పలువురు యువతీ యువకులు పీకల్లోతు మద్యం సేవించి ఉన్నారని, కరోనా లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని స్ధానికులు తెలిపారు.