మియాపూర్లో విషాదం.. ట్యాబ్ ఇవ్వలేదని 12ఏళ్ల బాలుడు ఆత్మహత్య
హైదరాబాద్ మియాపూర్లో విషాదం జరిగింది. ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియో గేమ్ ఆడుకునేందుకు ట్యాబ్ ఇవ్వలేదనే కోపంతో 12ఏళ్ల బాలుడు అపార్ట్మెంట్

హైదరాబాద్ మియాపూర్లో విషాదం జరిగింది. ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియో గేమ్ ఆడుకునేందుకు ట్యాబ్ ఇవ్వలేదనే కోపంతో 12ఏళ్ల బాలుడు అపార్ట్మెంట్
హైదరాబాద్ మియాపూర్లో విషాదం జరిగింది. ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియో గేమ్ ఆడుకునేందుకు ట్యాబ్ ఇవ్వలేదనే కోపంతో 12ఏళ్ల బాలుడు అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని స్వప్న నిర్మాణ్ అపార్ట్ మెంట్ పెంట్ హౌస్లో ఉంటున్న శ్రీనివాస్కు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు బాల వెంకట సత్య ప్రసాద్ ట్యాబ్తో ఆడుకుంటున్నాడు. పెద్ద కొడుకు నంద కిషోర్ ట్యాబ్ కావాలని అడిగాడు. దీంతో తండ్రి శ్రీనివాస్ చిన్న కొడుకు సత్య ప్రసాద్ నుంచి ట్యాబ్ తీసుకుని..పెద్ద కుమారుడు నంద కిషోర్కు ఇచ్చాడు.
గేమ్ ఆడుకుంటుండగా తండ్రి ట్యాబ్ లాక్కోవడంపై మనస్థాపానికి గురైన సత్య ప్రసాద్ క్షణాల్లో బిల్డింగ్ పైనుంచి దూకాడు. తీవ్రగాయాలతో స్పాట్ లోనే మృతి చెందాడు. మృతుడు సత్య ప్రసాద్ కొండాపూర్లోని మహర్షి విద్యా మందిర్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అప్పటివరకు ఆడుకుంటున్న కొడుకు ఒక్కసారిగా బిల్డింగ్ పై నుండి దూకి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్న విషయానికే ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 12ఏళ్ల బాలుడు మనస్తాపానికి గురి కావడం, ఆత్మహత్య చేసుకోవడం చర్చకు దారితీసింది. పిల్లల విపరీత ప్రవర్తనకు ఈ ఘటన అద్దం పడుతోంది. ఈ పరిణామం పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన నింపింది. పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.