ముంబై మాఫియా : రూ.వెయ్యి కోట్ల డ్రగ్స్ పట్టివేత
ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు డ్రగ్ మాఫియాకు చెక్ పెట్టారు. 2019 న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్ మాఫియా దందాల కొనసాగిస్తుంటాయి.

ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు డ్రగ్ మాఫియాకు చెక్ పెట్టారు. 2019 న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్ మాఫియా దందాల కొనసాగిస్తుంటాయి.
ముంబై : ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు డ్రగ్ మాఫియాకు చెక్ పెట్టారు. 2019 న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్ మాఫియా దందాల కొనసాగిస్తుంటాయి. ఈ క్రమలో భాగంగా నిషేదిత డ్రగ్స్ ను అక్రమంగా తరలిస్తున్న క్రమంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసలు వెయ్యి కోట్ల రూపాయల విలువైన మెడిసిన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ముంబై శాంటా క్రూజ్ ప్రాంతంలో నిర్వహించిన దాడిలో 1,000 కోట్ల రూపాయల విలువైన నిషేధిత మందులను స్వాధీనం చేసుకుంది. భారతదేశంలో నిషేధించబడిన ఫెంటాన్ల్ అనే డ్రగ్స్ ను ఉన్నట్లు గుర్తించారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులు అరెస్టు చేశారు.
ఫెంటాన్ల్ అనే మెడిసిన్..సాధారణంగా నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి మత్తుమందుగా వాడుతుంటారు. అటువంటి ఒక కిలో ఫెంటాన్ల్ మెడిసిన్ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 10 కోట్లు ధర పలుకుతుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్ కు ఈ డ్రగ్ ను తరలిస్తున్నారనే సమాచారంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేసిన సలీం దోలా, ఘనశ్యాం సరోజ్, చంద్రమణి తివారీ, సందీప్ తివారీ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు వారికి 2019 జనవరి 1 వరకు పోలీసులు కస్టడీకి అప్పగించింది.