28 ఏళ్ల నాటి హత్య కేసు-చర్చిఫాదర్, సిస్టరే హంతకులని తేల్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు

28 ఏళ్ల నాటి హత్య కేసు-చర్చిఫాదర్, సిస్టరే హంతకులని తేల్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు

Updated On : December 22, 2020 / 4:57 PM IST

Sister Abhaya murder case verdict:  కేరళలో 28 ఏళ్ల నాటి నన్ హత్య కేసుకు సంబంధించి తిరువనంతపురం లోని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఫాదర్ థామస్ కొట్టూర్, సిస్టర్ సెఫీలను దోషులుగా తీర్పు చెప్పింది. 1992 మార్చి 27 న , సిస్టర్ అభయ మృత దేహం కొట్టాయంలోని ప్యూయస్ టెన్త్ కాన్వెంట్ బావిలో లభించింది. అప్పటికి ఆమె వయస్స 18 సంవత్సరాలు. ఆమె ప్రీ డిగ్రీ కోర్సు చదువుతోంది.

ఈ కేసును ప్రాధమిక స్ధాయిలో స్థానిక పోలీసులు మరియు రాష్ట్ర నేర శాఖ దర్యాప్తు చేసింది. అభయ ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చింది. ఈ కేసులో సరైన దోషులను గుర్తించాలని కోరుతూ సామాజిక కార్యకర్త జోమోన్ పుథెన్ పురకల్ ఏర్పాటు చేసిన యాక్షన్ కమిటీ పలుమార్లు పిటీషన్లు దాఖలు చేసింది.  దీంతో ఈ కేసును 1993 మార్చి 29 న సీబీఐ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఫాదర్ థామస్ కొట్టూర్, సిస్టర్ సెఫీ లు చర్చిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అభయ గుర్తించిందని అందుకే వారు ఆమెను చంపేశారని సీబీఐ విచారణలో తేల్చింది. నాటి నుంచి సీబీఐ దర్యాప్తు కోనసాగుతున్నప్పటికీ తీర్పు వాయిదా పడుతూనే ఉంది. 2008 లో సీబీఐ ఫాదర్ కొట్టూరు, పుత్రికాయిల్, సెఫీలను సీబీఐ అరెస్ట్ చేసింది.

1992 మార్చి 27 తెల్లవారు ఝూమున అభయను సిస్టర్ సెఫీ గొడ్డలితో కొట్టగా ఫాదర్ కొట్టూరు ఆమెను బావిలోకి పడేశారని సీబీఐవాదించింది. వీరికి సహకరించిన మరోక పాధర్ జోస్ పుత్రిక్కాయిల్ ను కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కానీ తనను కేసులో అనవసరంగా ఇరికించారని పుత్రికాయిల్ పిటీషన్ దాఖలు చేయగా సీబీఐ కోర్టు అతడ్ని విడుదల చేసింది.

నిందితులపై ఐపీసీ సెక్షన్ 302,201, 34, ల కింద కేసులు నమోదు చేసారు. హత్య చేసినట్లు తేలటంతో తిరువనంతపురంలోని కోర్టు మంగళవారం వారివి దోషులుగా ప్రకటించింది. కాగా సాక్ష్యాలను తారుమారు చేయటానికి సహకరించారని ఆరోపణలు ఎదుర్కోని అరెస్టైన అప్పటి కేరళ పోలీసు స్పెషల్ బ్రాంచ్ మాజీ అధికారి కె.టి.మైఖేల్ ను కూడా గతేడాది విడుదల చేశారు. సిస్టర్ అభయ తల్లి నాలుగేళ్ల క్రితం కన్నుమూశారు. కాగా సీబీఐ ప్రత్యేక కోర్టు నిందితులకు  బుధవారం శిక్షలు ఖరారు చేయనుంది.