ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం : ఇద్దరు మృతి

ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.3గా నమోదైందని యూఎస్జీఎస్ తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సెంట్రల్ ఫిలిప్పీన్స్ ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకొని పలు భవనాలు నేల మట్టమయ్యాయి. ఈ భూకంప కేంద్రాన్ని మనీలాకు వాయువ్య దిశగా 60 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. భూప్రకంపనలతో మనీలాలో ప్రజలు ఇళ్లు కార్యాలయాల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.
Also Read : చిరంజీవి ‘పవన్ శంకర్’ : అభిమాని కొడుకుకి పేరు పెట్టిన చిరు