భారత్ లో ఒక్కరోజులో నేరాల సగటు : 80 హత్యలు.. 91 అత్యాచారాలు… 289 కిడ్నాప్‌లు

భారతదేశంలో 2018లో జరిగిన నేరాలపై నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వార్షిక నివేదిక చెబుతోంది. దేశంలో ఒక్కరోజులో సగటున 80 హత్యలు.. 91 అత్యాచారాలు... 289 కిడ్నాప్‌లు నమోదవుతున్నాయి. 

  • Published By: veegamteam ,Published On : January 10, 2020 / 02:36 AM IST
భారత్ లో ఒక్కరోజులో నేరాల సగటు : 80 హత్యలు.. 91 అత్యాచారాలు… 289 కిడ్నాప్‌లు

Updated On : January 10, 2020 / 2:36 AM IST

భారతదేశంలో 2018లో జరిగిన నేరాలపై నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వార్షిక నివేదిక చెబుతోంది. దేశంలో ఒక్కరోజులో సగటున 80 హత్యలు.. 91 అత్యాచారాలు… 289 కిడ్నాప్‌లు నమోదవుతున్నాయి. 

భారతదేశంలో 2018లో జరిగిన నేరాలపై నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వార్షిక నివేదిక చెబుతోంది. 2018లో నేరాల సంఖ్య సగటున 1.3 శాతం ఎక్కువ అయింది. అయితే ప్రతి లక్ష జనాభాకు నమోదైన కేసుల సంఖ్య మాత్రం 388.6 (2017) నుంచి 383.5(2018)కు తగ్గిందని ఎన్‌సీఆర్‌బీ తన నివేదికలో తెలిపింది. దేశంలో ఒక్కరోజులో సగటున 80 హత్యలు.. 91 అత్యాచారాలు… 289 కిడ్నాప్‌లు నమోదవుతున్నాయి. 

వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారిలో గత ఏడాది సుమారు 10,349 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. దేశ వ్యాప్తంగా వేర్వేరు కారణాల వల్ల సుమారు 1.34 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడగా.. ఇందులో వ్యవసాయ రంగంలో ఉన్న వారు 7.7 శాతం ఉన్నారు.  2017 సంవత్సరంలో జరిగిన రైతుల ఆత్మహత్యలతో పోల్చితే 2018లో ఆత్మహత్యలు 3.6 శాతం ఎక్కువ కావడం గమనార్హం. 

‘పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా, ఉత్తరాఖండ్, మేఘాలయా, గోవా, చండీగఢ్, దామన్‌ అండ్‌ డయ్యూ, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చెరిలలో రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలుదారులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడలేదు’ అని ఎన్‌సీఆర్‌బీ నివేదిక తెలిపింది. 

వ్యవసాయ కూలీఉలు మొత్తం 4,586 మంది ఆత్మహత్యలకు పాల్పడగా వీరిలో 4071 మంది పురుషులు, 515 మంది మహిళలు ఉన్నారు. అన్ని రకాల ఆత్మహత్యల్లో 17,972తో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. తమిళనాడు (13,896), పశ్చిమబెంగాల్‌ (13,255) రాష్ట్రాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

2018లో 29,017 హత్య కేసులు నమోదయ్యాయని, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1.7 శాతం ఎక్కువని  నివేదిక తెలిపింది. వివాదాల కారణంగా జరిగిన హత్యలు 9,623 కాగా, వ్యక్తిగత ద్వేషం, పగ వంటి కారణాలతో 3,875 మంది హత్యకు గురయ్యారు. లాభం కోసం చేసిన హత్యల సంఖ్య 2,995గా ఉంది. కిడ్నాపింగ్, ఎత్తుకెళ్లడం వంటి నేరాల సంఖ్య 2018లో ఎక్కువైంది. 2017లో మొత్తం 95,893 కిడ్నాప్‌ కేసులు నమోదు కాగా, 2018లో ఈ సంఖ్య 10.3 శాతం పెరిగి 1.05 లక్షలకు చేరింది. 

కిడ్నాపైన వారిలో 80 వేల కంటే ఎక్కువ మంది మహిళలు కాగా, పురుషుల సంఖ్య 24,665 మాత్రమే. అంతేకాదు.. కిడ్నాపైన మొత్తం 1.05 లక్షల మందిలో 63,356 మంది బాలబాలికలు కావడం గమనార్హం. కిడ్నాపైన వారిలో 92,137 మంది (22,755 మంది పురుషులు, 69, 382 మంది మహిళలు)ని పోలీసులు కిడ్నాప్‌ చెర నుంచి విడిపించగలిగారు. మొత్తం 91, 709 మందిని సజీవంగా వెనక్కు తీసుకు రాగలిగితే.. 428 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.