BJP Leader Threatens Woman : మహిళపై చేయిచేసుకున్న బీజేపీ నాయకుడు
రాజకీయ నాయకులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిచటం... వారితో ఇతర సంబంధాలు కలిగే ఉండే సంఘటనలు ఇటీవల తరచూగా వెలుగు చూస్తున్నాయి.
BJP Leader Threatens Woman : రాజకీయ నాయకులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిచటం… వారితో ఇతర సంబంధాలు కలిగే ఉండే సంఘటనలు ఇటీవల తరచూగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా బీజేపీ కి చెందిన ఒక యువనేత భూమి కబ్జా చేయటమే కాకుండా ఒక మహిళపట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటన నోయిడాలో చోటు చేసుకుంది.
నోయిడాలోని సెక్టార్ 93బీ లోని గ్రాండ్ ఓమాక్సే లో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీకాంత్ త్యాగి నివాసం ఉంటున్నాడు. అయితే మూడేండ్ల క్రితం సొసైటీకి చెందిన కామన్ ఏరియాతో పాటు పాటు పార్క్ను ఆక్రమించుకున్నాడు. దీంతో 2019 నుంచి సొసైటీ సభ్యులకు, శ్రీకాంత్ త్యాగికి గొడవలు ఉన్నాయి. ఆగస్టు5 శుక్రవారం ఉదయం పార్క్ ఏరియాలో మొక్కలు నాటేందుకు శ్రీకాంత్ వచ్చాడు. అతన్ని సొసైటీకి చెందిన ఓ మహిళ అడ్డుకున్నారు. దీంతో ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించిన త్యాగి.. చేయితో నెట్టేశాడు.
ఈ సందర్భంగా బాధిత మహిళ మాట్లాడుతూ.. తనతో పాటు తన భర్త, పిల్లలను త్యాగి బెదిరింపులకు గురి చేశాడని, అసభ్యకర పదజాలంతో దూషించాడని పేర్కొన్నది. మొక్కలను టచ్ చేస్తే నీ అంతు చూస్తానని బెదిరించాడని వాపోయింది. మహిళపై చేయి చేసుకున్న త్యాగిని కఠినంగా శిక్షించాలని….తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈవిషయమై పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీకాంత్ త్యాగిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 354 (ఏదైనా మహిళపై దాడి చేయడం లేదా క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించడం, ఆగ్రహానికి గురిచేయడం లేదా ఆమె నిరాడంబరతకు భంగం కలిగించే అవకాశం ఉందని తెలుసుకోవడం) కింద కేసు నమోదు చేశామని అని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (మహిళా భద్రత) ) అంకిత శర్మ చెప్పారు.
కాగా ఈ సంఘటన జరిగిన తర్వాత బీజేపీ ఉన్నత స్ధాయి నాయకులు త్యాగి తమ పార్టీ సభ్యుడు కాదని ప్రకటించుకున్నారు. అయితే…త్యాగి తనను తాను బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యునిగా మరియు అధికార పార్టీకి చెందిన యువ కిసాన్ సమితి జాతీయ కో-కార్డినేటర్గా సోషల్ మీడియాలో రాసుకున్నారు. వివాదం ముదిరినప్పుడు త్యాగికి దూరంగా ఉండటానికి బిజెపి ప్రయత్నించినప్పుడు… జెపి నడ్డా మరియు స్వతంత్ర దేవ్ సింగ్ వంటి సీనియర్ పార్టీ నాయకులతో త్యాగి కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని… పరారీలో ఉన్నత్యాగి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.