Uttarakhand : పక్కా ప్లాన్ .. కొత్త ప్రియుడి కోసం పాత ప్రియుడ్ని పాముకాటుతో చంపించిన యువతి

పాత బాయ్ ఫ్రెండ్ ను వదిలించుకోవాలి.కొత్త బాయ్ ఫ్రెండ్ ఎంజాయ్ చేయాలి.అందుకోసం ఓ యువతి పాముకాటుతో పాత బాయ్ ఫ్రెండ్ ను హత్య చేయించింది.

Uttarakhand : పక్కా ప్లాన్ .. కొత్త ప్రియుడి కోసం పాత ప్రియుడ్ని పాముకాటుతో చంపించిన యువతి

Uttarakhand woman boy friend snake bit

Uttarakhand woman boy friend snake bit : ఓ వ్యక్తి కారులో మరణించాడు.కారు డోర్లు మూసుకుపోయి ఊపిరి ఆడక మరణించాడని అనుకున్నారు. కానీ కాళ్లపై పాము కాట్లు కనిపించటంతో అసలు విషయం గురించి ఆరా తీయగా షాక్ అయ్యే విషయాలు బయటపడ్డాయి. ఓయువతీ, యువకుడు అతని మరణానికి కారణమని తెలుసుకున్న పోలీసులే షాక్ అయ్యారు. ఓ యువతి తన పాత ప్రియుడ్ని వదిలించుకోవటానికి కొత్త ప్రియుడితో పారిపోవటానికి వేసిన పక్కా ప్లాన్ లో భాగంగా పాత ప్రియుడ్ని పాముతో కరిపించిం చంపించిన ఘటన ఉత్తరాఖండ్ లో వెలుగులోకి వచ్చింది.

జులై 15న నైనిటాల్ ప్రాంతంలోని హల్ద్వానీ పోలీసులు ఓ కారులో ఓ మృతదేహాన్ని గుర్తించారు. ఆ వ్యక్తి అంకిత్ చౌహాన్ అనే వ్యాపారవేత్తగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతను కారు ఏసీ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వల్లచనిపోయాడని భావించారు. కానీ పోస్టుమార్టంలో అంకిత్ చౌహాన్ కాళ్లపై పాము కాట్లు కనిపించటం పాముకాటువల్లే అతను చనిపోయాడని తెలిసి షాక్ అయ్యారు. దీంతో అతను మృతదేహాన్ని కనుగొన్న ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఓ యువతి జాడ తెలిసింది.దీంతో ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.

Manipur Women Viral Video : నాటి షాకింగ్ ఘటన గురించి బాధిత మణిపూర్ మహిళ ఏం చెప్పారంటే…

ఈక్రమంలో అంకిత్ చౌహాన్ సోదరి ఇషా తన సోదరుడి మరణానికి కారణం మహీ ఆర్యా అనే యువతి.ఆమె ప్రియుడు దీపక్ కందపాల్ అనే వ్యక్తి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆదిశగా పోలీసులు దర్యాప్తు చేశారు. దీంట్లో భాగంగా అంకిత్ చౌహాన్, మహీ ఆర్యా అనే యువతి ప్రేమించుకున్నారనే విషయం తెలిసింది. దీంతో ఆమె ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. ఆ డేటాలో రమేశ్ నాథ్ అనే పాములుపట్టే వ్యక్తితో మహీ ఆర్యా చాలాసార్లు ఫోన్ లో మాట్లాడినట్టు గుర్తించారు.దీంతో పోలీసులు రమేశ్ నాథ్ కోసం గాలించి పట్టుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా..మహీ ఆర్యా అనే యువతి తన వద్దకు ఓ వ్యక్తితో కలిసి వచ్చిందని..అంకిత్ చౌహాన్ ను నాగుపాముతో కాటేయించి చంపాలని రూ.10వేలు ఇచ్చారని.. అలా అతనిని పాముతో కరిపించి చంపానని తెలిపాడు.

పాముకాటుతో చనిపోతే హత్య అని ఎవరూ అనుకోరని..అందుకే పాముతో కరిపించాలని ఆమె ప్లాన్ వేసి ఇలా చేసిందని చెప్పాడు. పాములు పట్టే వ్యక్తి రమేశ్ నాథ్ చెప్పిన వివరాల ప్రకారం… మహీ ఆర్యా, ఆమె కొత్త ప్రియుడు దీపక్ కందపాల్ నేపాల్ పారిపోయినట్టు తెలిసింది. వారిని పట్టుకునేందుకు పోలీసులు రెండు బృందాలను నేపాల్ పంపించారు.

Human Rights Commission : మణిపూర్ ఘటనపై మానవ హక్కుల కమిషన్ నోటీస్