AP EAPCET 2025 Counselling: ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు

AP EAPCET 2025 Counselling: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ 2025 (AP EAPCET 2025) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

AP EAPCET 2025 Counselling:  ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు

AP EAPCET 2025 Counselling started

Updated On : July 8, 2025 / 11:10 AM IST

ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ 2025 (AP EAPCET 2025) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈఏపీసెట్‌ లో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం ఆన్లైన్ https://eapcet-sche.aptonline.in/EAPCET/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం, అభ్యర్థులు జులై 16 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆధ్వర్యంలో ఈ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.

ముఖ్యమైన తేదీలు, మరిన్ని వివరాలు:

ధృవపత్రాల ఆన్‌లైన్ పరిశీలన: జులై 17 వరకు కొనసాగుతుంది.

వెబ్ ఆప్షన్ల నమోదు: అభ్యర్థులు జులై 13వ తేదీ నుంచి 18 వరకు చేసుకోవచ్చు

వెబ్ ఆప్షన్లలో మార్పు: జులై 19న ఏమైనా మార్పులు ఉంటె చేసుకోవచ్చు.

సీట్ల కేటాయింపు ఫలితాలు: మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను జులై 22న ప్రకటిస్తారు.

కళాశాలల్లో రిపోర్టింగ్: సీట్లు పొందిన అభ్యర్థులు జులై 23 నుంచి 26 లోపు తమకు కేటాయించిన కళాశాలల్లో రిపోర్టింగ్ చేసుకొవాలి.

తరగతుల ప్రారంభం: ఆగస్టు 4 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

కౌన్సిలింగ్ ఫీజు: ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది.