JEE Main Session 2 : జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష సమయంలో పాటించాల్సిన ముఖ్యమైన మార్గదర్శకాలివే!

JEE Main Session 2 : జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 4న ప్రారంభమై ఏప్రిల్ 15న ముగుస్తుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎన్‌టీఏ కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేంటో ఓసారి తెలుసుకుందాం.

JEE Main Session 2 : జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష సమయంలో పాటించాల్సిన ముఖ్యమైన మార్గదర్శకాలివే!

JEE Main Session 2 _ Important Guidelines To Follow During Exam

JEE Main Session 2 : ప్రముఖ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (జేఈఈ మెయిన్) 2024 సెషన్ 2 ఏప్రిల్ 4న ప్రారంభం కానుంది. పేపర్ 1 (బీఈ/ బీటెక్) అలాగే పేపర్ 2ఎ, 2బి (బీఆర్చ్, బీప్లానింగ్)లను కవర్ చేస్తుంది. సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 15 వరకు నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్టీఏ జారీ చేసిన ఈ కింది మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. అభ్యర్థులు పరీక్షా కేంద్రంలో సమయానికి అంటే.. పరీక్ష ప్రారంభానికి 2 గంటల ముందు రిపోర్ట్ చేయాలని సూచించారు.

పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వస్తే అనుమతించరు :
పరీక్ష హాలు ఓపెన్ చేసిన వెంటనే అభ్యర్థులు తమ సీట్లలో కూర్చోవాలి. ట్రాఫిక్ జామ్, రైలు/బస్సు ఆలస్యం మొదలైన కారణాల వల్ల అభ్యర్థులు సమయానికి రిపోర్టు చేయకపోతే.. పరీక్షా గదులు/హాళ్లలోకి ప్రవేశం ఉండదు. ఏదైనా జాప్యానికి ఎన్‌టీఏ బాధ్యత వహించదు. పరీక్ష గది/హాల్‌లో ప్రవేశం కోసం అభ్యర్థి తప్పనిసరిగా ఎన్‌టీఏ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన అడ్మిట్ కార్డ్‌ను ఆన్-డిమాండ్ చూపించాలి.

Read Also : UPSC Prelims Reschedule : ఎన్నికల వేళ.. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా.. జూన్ 16న పరీక్ష!

చెల్లుబాటు అయ్యే అడ్మిట్ కార్డ్‌లు, అధీకృత ఫొటో ఐడీలు లేని అభ్యర్థులు ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షకు హాజరు కావడానికి సెంటర్ సూపరింటెండెంట్ అనుమతించరు. ప్రతి అభ్యర్థికి రోల్ నంబర్ సూచించే సీటు కేటాయిస్తారు. అభ్యర్థులు తమకు కేటాయించిన సీట్లలో మాత్రమే కూర్చోవాలి. ఒక అభ్యర్థి తన సీటును మార్చుకున్నా లేదా కేటాయించిన సీటులో కూర్చోని పక్షంలో అభ్యర్థిత్వాన్ని రద్దు చేయవచ్చు. ఈ విషయంలో ఎలాంటి అభ్యర్ధనను స్వీకరించరు.

అభ్యర్థి కంప్యూటర్‌లో అందుబాటులో ఉన్న ప్రశ్నపత్రం అడ్మిట్ కార్డ్‌లో సూచించిన అతని/ఆమె ఎంచుకున్న సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఒకవేళ, ప్రశ్నపత్రంలోని సబ్జెక్ట్ అతను/ఆమె ఎంచుకున్న సబ్జెక్ట్ కాకుండా వేరేది అయితే, దానిని సంబంధిత ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకురావచ్చు. అభ్యర్థులు పరీక్ష సమయంలో ఏదైనా సాంకేతిక సాయం, ప్రథమ చికిత్స అత్యవసరం లేదా ఏదైనా ఇతర సమాచారం కోసం గదిలోని సెంటర్ సూపరింటెండెంట్/ఇన్విజిలేటర్‌ను సంప్రదించవచ్చు.

పరీక్ష రోజున అవసరమైన డాక్యుమెంట్లు :
అభ్యర్థులు పరీక్ష రోజున పరీక్షా కేంద్రంలో ఈ కింది డాక్యుమెంట్లను తప్పనిసరిగా తీసుకురావాలి. తీసుకురాని విద్యార్థులను పరీక్షకు అనుమతించరు. ఎన్‌‌టీఏ వెబ్‌సైట్ (A4 సైజు పేపర్‌పై ప్రింట్‌అవుట్) నుంచి డౌన్‌లోడ్ చేసిన (అండర్‌టేకింగ్)తో పాటుగా అడ్మిట్ కార్డ్ ప్రింట్ కాపీని సరిగా పూర్తి చేయండి. పరీక్ష సమయంలో సెంటర్‌లోని అటెండెన్స్ షీట్‌లోని నిర్దిష్ట స్థలంలో పేస్ట్ చేసేందుకు ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో (ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో అప్‌లోడ్) ఉండాలి.

ధృవీకరణ ఫోటో ఐడీలలో ఏదైనా ఒకటి (ఒరిజినల్, లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ) స్కూల్ ఐడెంటిటీ కార్డ్/ పాన్ కార్డ్/ డ్రైవింగ్ లైసెన్స్/ ఓటర్ ఐడీ/ పాస్‌పోర్ట్/ ఆధార్ కార్డ్ (ఫోటోతో)/ఇ-ఆధార్ ఫోటోగ్రాఫ్/ రేషన్ కార్డ్ ఫోటోగ్రాఫ్‌తో/ 12వ తరగతి బోర్డు ఫొటోగ్రాఫ్‌తో అడ్మిట్ కార్డ్/ ఫొటోగ్రాఫ్‌తో బ్యాంక్ పాస్‌బుక్ ఏదైనా ఒకటి దగ్గర ఉండాలి.

పీడబ్ల్యూడీ కేటగిరీ కింద సడలింపును క్లెయిమ్ చేసుకుంటే.. ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ ప్రకారం.. రాయడానికి పరీక్షలో శారీరక పరిమితికి సంబంధించి పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, అధీకృత వైద్య అధికారి జారీ చేసిన పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, సాధారణ బాల్ పాయింట్ పెన్ తప్పనిసరిగా ఉండాలి.

Read Also : UPSC Exams Competition : యూపీఎస్సీ పరీక్షల కోసం యువకులు సమయాన్ని వృథా చేస్తున్నారు.. సంజీవ్ సన్యాల్ కామెంట్స్!