Scholarship Scheme: విద్యార్థులకు గుడ్ న్యూస్.. మహీంద్రా నుంచి రూ.30 వేల స్కాలర్షిప్.. లాస్ట్ డేట్ దగ్గరపడుతోంది.. వెంటనే అప్లై చేసుకోండి
మహీంద్రా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది(Scholarship Scheme). కె.సి. మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ (KCMET) ప్రభుత్వ పాఠశాలల్లో

mahindra all india talent scholarship scheme of rs 30000 for poor students
Scholarship Scheme: ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మహీంద్రా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. కె.సి. మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ (KCMET) ప్రభుత్వ పాఠశాలల్లో పాలిటెక్నిక్ చదువుతున్న(Scholarship Scheme) విద్యార్థులకు మహీంద్రా ఆల్ ఇండియా టాలెంట్ స్కాలర్షిప్ (MAITS) స్కీం ద్వారా ఆర్థిక సహాయం అందించనుంది. చదవాలన్న కోరిక ఉంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ స్కీం మంచి సహాయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి, అర్హులైన విద్యార్థులకు అధికారిక పోర్టల్ https://maitscholarship.kcmet.org/ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన 550 మంది విద్యార్థులకు మూడేళ్ల పాటు ప్రతీ సంవత్సరం రూ.10,000 చొప్పున మూడు సంవత్సరాలకు గాను రూ. 30,000 స్కాలర్షిప్ అందుతుంది.
అర్హతలు:
- విద్యార్థులు 10, 12వ తరగతి / తత్సమాన పరీక్షల్లో 60% కన్నా ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.
- ప్రభుత్వ/ గుర్తింపు పొందిన ఏదైనా పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా మొదటి సంవత్సరంలో చదువుతూ ఉండాలి.
- వార్షిక ఆదాయం తక్కువగా ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు, ముఖ్యంగా అమ్మాయిలు, దివ్యాంగులు, సాయుధ దళాల కుటుంబాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తు విధానం:
విద్యార్థులు అధికారిక వెబ్ పోర్టల్ https://maitscholarship.kcmet.org/ నుండి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు ఆగస్టు 27, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ స్కీం గురించి మరిన్ని వివరాలు కోసం www.kcmet.org వెబ్సైట్ను సందర్శించవచ్చు.