NEET PG 2025: నీట్ పీజీ పరీక్ష అప్డేట్.. ఆగస్టు 3న ఎగ్జామ్, సెప్టెంబర్ లో ఫలితాలు.. అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడంటే?
NEET PG 2025: వైద్య విద్యార్థులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2025 పరీక్ష (NEET PG Exam)ను ఆగస్టు 3న నిర్వహిచనుంది.

NEET PG 2025 entrance exam to be held across the country on August 3
వైద్య విద్యార్థులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2025 పరీక్ష (NEET PG Exam)ను ఆగస్టు 3న నిర్వహిచనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఇప్పటికే పూర్తిచేసింది. వచ్చే ఆదివారం (ఆగస్టు 3) ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు ఈ పరీక్ష జరుగనుంది.
ఈ పరీక్షకు సంబందించిన అడ్మిట్ కార్డులను 4 రోజుల ముందు అంటే జూలై 31న విడుదల చేయనుంది. అధికారిక వెబ్సైట్ natboard.edu.in ద్వారా అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు తమ హాల్టికెట్ను ఈ వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ పరీక్ష ద్వారా డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (MD), పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా, మాస్టర్ ఆఫ్ సర్జరీ (MS), పోస్ట్ ఎంబీబీఎస్ డాక్టరేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (DrNB), డిప్లొమాట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (DNB) డిప్లామా లాంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షా రాయనున్నారు. వారిలో కేవలం తెలంగాణ నుంచే 10 వేల మందికి పైగా ఉండటం విశేషం. తెలంగాణ అభ్యర్థుల కోసం హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. సెప్టెంబర్ 3 నాటికి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి.