వైఎస్‌ విజయలక్ష్మి, షర్మిలకు కోర్టు సమన్లు

వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సోదరి షర్మిలకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరి 10న హాజరుకావాలని ప్రత్యేక కోర్టు సమన్లు ఇచ్చింది.

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 02:09 AM IST
వైఎస్‌ విజయలక్ష్మి, షర్మిలకు కోర్టు సమన్లు

Updated On : January 7, 2020 / 2:09 AM IST

వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సోదరి షర్మిలకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరి 10న హాజరుకావాలని ప్రత్యేక కోర్టు సమన్లు ఇచ్చింది.

వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సోదరి షర్మిలకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. 2019, జనవరి 10న హాజరుకావాలని ప్రత్యేక కోర్టు సమన్లు ఇచ్చింది. వీరితో పాటుగా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కూడా సమన్లు జారీ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై సభ నిర్వహించారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని 2012లో పరకాల పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి కోర్టు వారికి సమన్లు జారీ చేసింది.

2012 నాటి కేసులో ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వైఎస్‌ విజయలక్ష్మి, షర్మిలకు  వారితో పాటు ఏ3, ఏ4లుగా ఉన్న అప్పటి పరకాల వైసీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 10న ప్రత్యేక న్యాయస్థానంలో వీరంతా హాజరు కావాల్సి ఉంది. ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై సభ నిర్వహించారని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరకాల పోలీస్‌స్టేషన్‌లో వారిపై కేసు నమోదైంది. 

మరోవైపు అక్రమాస్తుల కేసులో అదే రోజు కోర్టుకు సీఎం జగన్‌ సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. అక్రమార్కుల కేసులో జగన్ గైర్హాజరుపై సీబీఐ న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గత శుక్రవారం కూడా జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరుకాలేదు. హాజరు నుంచి మళ్లీ మినహాయించాలని జగన్‌ తరపు లాయర్‌ కోరారు. పదే పదే మినహాయిపు కోరడంపై సీబీఐ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. 

అక్రమాస్తుల కేసులో జగన్‌ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇప్పటివరకు జగన్‌కు 10 సార్లు మినహాయింపు ఇచ్చామని కోర్టు తెలిపింది. 10న విచారణకు హాజరై తీరాల్సిందేనని కోర్టు ఆదేశించింది. అయితే జగన్ కుటుంబసభ్యులకు ఇలా కోర్టు నోటీసులు అందడం పట్ల వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.