గ్రూప్-2 నియామకాలపై స్టే విధించిన హైకోర్టు

గ్రూప్-2 నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నియామకాలు చేపట్టవద్దని టీఎస్ పీఎస్ సీని ఆదేశించింది.

  • Published By: veegamteam ,Published On : November 20, 2019 / 12:39 PM IST
గ్రూప్-2 నియామకాలపై స్టే విధించిన హైకోర్టు

Updated On : November 20, 2019 / 12:39 PM IST

గ్రూప్-2 నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నియామకాలు చేపట్టవద్దని టీఎస్ పీఎస్ సీని ఆదేశించింది.

గ్రూప్-2 నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నియామకాలు చేపట్టవద్దని టీఎస్ పీఎస్ సీని ఆదేశించింది. గతంలో గ్రూప్-2 కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తూ టీఎస్ పీఎస్ సీ వ్యవహరించిందని గ్రూప్-2 అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు వైట్నర్‌, ట్యాంపరింగ్‌, స్క్రాచింగ్‌ చేసిన అభ్యర్థులను సెలక్ట్‌ చేయొద్దని పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీంతో గ్రూప్‌-2 పరీక్షల్లో అందుకు సంబంధించిన జవాబులు తీసివేసి మిగిలిన వారికి ఇంటర్య్వూలలో 1:2 ప్రకారం నియామకాలు జరపాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ వెల్లడించింది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు లెక్కచేయకుండా మళ్లీ అదే అభ్యర్థులను సెలక్ట్‌ చేసి ప్రొవిజనల్‌ లిస్ట్‌​ను ప్రకటించింది. దీన్ని సవాలు చేస్తూ ఫైనల్‌ లిస్టుకు సెలక్ట్‌ కాని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని టీఎస్‌పీఎస్ సీని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నియామకాలు చేపట్టరాదని తెలిపింది. తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.