Hydra : రూ.3వేల కోట్లకు పైగా విలువైన భూమిని కాపాడిన హైడ్రా.

Hydra : రూ.3వేల కోట్లకు పైగా విలువైన భూమిని కాపాడిన హైడ్రా.

Updated On : January 11, 2026 / 8:15 AM IST

Hydra: హైదరాబాద్ మియాపూర్ లో హైడ్రా బిగ్ ఆపరేషన్ చేపట్టింది. 3వేల కోట్ల రూపాయలకుపైగా విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. రంగారెడ్డి జిల్లా మియాపూర్ మక్తా మహబూబ్ పేటలో కబ్జా కోరల నుంచి భూమిని విడిపించింది. ప్రజావాణిలో ఫిర్యాదు ఆధారంగా యాక్షన్ లోకి దిగిన హైడ్రా.. సర్వే నెంబర్ 44లోని 15 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని కాపాడింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో గతంలో 5 ఎకరాలను హైడ్రా స్వాధీనం చేసుకుంది. తాజాగా హద్దులను నిర్ణయించి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. తప్పుడు సర్వే నెంబర్లతో కబ్జాకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదైంది..

హైదరాబాద్ నగరంలో మరోసారి హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. కబ్జా కోరల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడింది. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఇది. కబ్జాలకు గురైన రోడ్లు, పార్కులు, ప్రభుత్వ స్థలాలపై హైడ్రా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. కబ్జాలు, ఆక్రమణలకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేశారంటే చాలు.. హైడ్రా వెంటనే యాక్షన్ లోకి దిగిపోతోంది. కొన్ని అంశాల్లో కోర్టు కేసులు ఉన్నా హైడ్రా వెనక్కి తగ్గడం లేదు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ ద్వారా కబ్జాలు జరిగాయని, పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని తెలిస్తే చాలు.. హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది. కబ్జాకు గురైనా భూములను స్వాధీనం చేసుకుంటోంది.