దేశం ఆశ్చర్యపోయేలా రెవెన్యూ చట్టం

  • Published By: veegamteam ,Published On : September 22, 2019 / 08:07 AM IST
దేశం ఆశ్చర్యపోయేలా రెవెన్యూ చట్టం

Updated On : September 22, 2019 / 8:07 AM IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం ఆశ్చర్యపోయేలా అద్భుతమైన రెవెన్యూ చట్టం తేబోతున్నామని చెప్పారు. ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రెవెన్యూలో జరిగిన అవకతవకలు ఎవరి పుణ్యం అన్నారు. వీఆర్వోలను తొలగించాల్సిన అవసరం వస్తే తొలగిస్తామని చెప్పారు. 

కౌలు దారులను తాము గుర్తించడం లేదన్నారు. 80 శాతం భూములు, దళిత, గిరిజనుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. కౌలుదారులకు రైతు బంధు పథకం వర్తించదన్నారు. భూమి కాపాడుకున్న రైతులకు అండగా ఉంటామన్నారు. రైతులకు బాగు కోసమే ఉన్నామని..వారికి నష్టం జరుగనివ్వబోమన్నారు. వారిని అన్ని విధాలుగా కాపాడతామన్నారు. జగీర్దారులు ఉన్నప్పటి కౌలుదారులు..ఇప్పటి కౌలుదారులు వేర్వేరు అన్నారు.