నాంపల్లిలో కూలిన పురాతన భవనం

హైదరాబాద్ లో ఓ పురాతన భవనం కూలి పలువురికి గాయాలయ్యాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న మొఘల్ షరాఫ్ అనే పురాతన చారిత్రక భవనం శనివారం సాయంత్రం కుప్పకూలిపోయింది.
భవనం శిధిలావస్ధకు చేరుకోవటంతో ఆ భవనంలో కొందరు యాచకులు తలదాచుకుంటున్నారు. పలువురు యాచకులు శిధిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.