అర గంటకు ఒకటి, అర్థరాత్రి కూడా సర్వీసులు : గణేష్ నిమజ్జనానికి MMTS ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. ఇన్నాళ్లు పూజలు అందుకున్న గణనాథుల ప్రతిమలు నిమజ్జవానికి తరలివెళ్తున్నాయి. గణపతి బొప్పా మోరియా

  • Published By: veegamteam ,Published On : September 12, 2019 / 04:06 AM IST
అర గంటకు ఒకటి, అర్థరాత్రి కూడా సర్వీసులు : గణేష్ నిమజ్జనానికి MMTS ప్రత్యేక రైళ్లు

Updated On : September 12, 2019 / 4:06 AM IST

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. ఇన్నాళ్లు పూజలు అందుకున్న గణనాథుల ప్రతిమలు నిమజ్జవానికి తరలివెళ్తున్నాయి. గణపతి బొప్పా మోరియా

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. ఇన్నాళ్లు పూజలు అందుకున్న గణనాథుల ప్రతిమలు నిమజ్జవానికి తరలివెళ్తున్నాయి. గణపతి బొప్పా మోరియా నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మార్మోగుతున్నాయి. గణేష్ నిమజ్జనం చూసేందుకు పెద్ద సంఖ్యలో జనాలు ట్యాంక్ బండ్ కి తరలి వస్తున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా అధికారులు ప్రత్యేక రవాణ సౌకర్యాలు కల్పించారు. ఆర్టీసీ బస్సులతో పాటు ఎంఎంటీస్ స్పెషల్ రైళ్లు నడుపుతన్నారు. సెప్టెంబర్ 12 రాత్రి 10 గంటల నుంచి 13న తెల్లవారుజామున 4 గంటల వరకు  8 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ప్రతి అర గంటకు ఒకటి చొప్పున ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ సర్వీసులు నడుస్తాయి. 

MMTS స్పెషల్ ట్రైన్స్:
* లింగంపల్లి-ఫలక్‌నుమా
* సికింద్రాబాద్-ఫలక్‌నుమా
* సికింద్రాబాద్-నాంపల్లి
* ఫలక్‌నుమా-లింగంపల్లి
* నాంపల్లి-ఫలక్‌నుమా
* నాంపల్లి-లింగంపల్లి మధ్య ఈ అదనపు రైళ్లు నడుస్తాయి.

నగరంలో రైళ్ల రాకపోకల సమాచారం కోసం ‘హైలైట్స్‌’ మొబైల్‌ యాప్‌ తీసుకొచ్చారు. ప్రయాణికులు ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా ఎంఎంటీఎస్‌ రైళ్ల ప్రత్యక్ష సమాచారాన్ని తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రధాన రైళ్ల వేళలు ఈ యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు లభిస్తాయి. జంటనగరాల్లో ప్రతి రోజు 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులు ప్రయాణికులకు సదుపాయాన్ని అందజేస్తున్నాయి. నాంపల్లి-లింగంపల్లి, ఫలక్‌నుమా-సికింద్రాబాద్, ఫలక్‌నుమా-లింగంపల్లి, నాంపల్లి-ఫలక్‌నుమా మార్గాల్లో రైళ్లు నడుస్తున్నాయి.

ప్రతి రోజు 1.5 లక్షల మంది ప్రయాణికులు ఎంఎంటీఎస్‌ సేవలను వినియోగించుకుంటున్నారు. పలువురు ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు ఎంఎంటీఎస్‌పైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. ఇలాంటి ప్రయాణికులకు ‘హైలైట్స్‌’ యాప్‌ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు వివిధ రూట్లలో నడిచే రైళ్లను ప్రత్యక్షంగా ఈ యాప్‌ ద్వారా తెలుసుకొనేందుకు అవకాశం లభిస్తుంది. ఏ ట్రైన్‌ ఏ రూట్ లో ఎక్కడి వరకు వచ్చిందనేది ఈ యాప్‌ ద్వారా తేలిగ్గా తెలుసుకోవచ్చు. మూడేళ్ల క్రితం అందుబాటులోకి తెచ్చిన ఈయాప్‌ను ప్రతి రోజు వేలాది మంది ప్రయాణికులు వినియోగించుకుంటున్నారని అధికారులు తెలిపారు.