పట్నానికి రాబోతున్న పల్లె : హైదరాబాద్ లో స్వీట్, కైట్‌ ఫెస్టివల్‌

హైదరాబాద్ స్వీట్, కైట్ ఫెస్టివల్ కు వేదిక కానుంది. జనవరి 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్‌ పరేడ్, జింఖానా గ్రౌండ్స్ ల్లో స్వీట్, కైట్‌ ఫెస్టివల్‌ జరుగనున్నాయి.

  • Published By: veegamteam ,Published On : January 10, 2020 / 01:26 AM IST
పట్నానికి రాబోతున్న పల్లె : హైదరాబాద్ లో స్వీట్, కైట్‌ ఫెస్టివల్‌

Updated On : January 10, 2020 / 1:26 AM IST

హైదరాబాద్ స్వీట్, కైట్ ఫెస్టివల్ కు వేదిక కానుంది. జనవరి 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్‌ పరేడ్, జింఖానా గ్రౌండ్స్ ల్లో స్వీట్, కైట్‌ ఫెస్టివల్‌ జరుగనున్నాయి.

హైదరాబాద్ స్వీట్, కైట్ ఫెస్టివల్ కు వేదిక కానుంది. జనవరి 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్‌ పరేడ్, జింఖానా గ్రౌండ్స్ ల్లో స్వీట్, కైట్‌ ఫెస్టివల్‌ జరుగనున్నాయి. మూడేళ్లుగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలకు ఏటా ఓ కొత్త ఈవెంట్‌ను జోడిస్తున్నారు. ఈ సారి గ్రామీణ పని, ఆటపాటలను జోడిస్తున్నారు. పల్లెల్లోనూ కనిపించకుండా పోయిన విసుర్రాయి, తాడూ బొంగరం, చిర్రగోన, టైరు ఆట, గోలీలాటల సందడితో పదికి పైగా ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు.

ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌లో భాగంగా ఈ సారి అమెరికా, సింగపూర్, ఇండోనేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక తదితర 20 దేశాల పతంగ్‌లు ఎగరనున్నాయి. 13న ఉదయం, సాయంత్రం వేళల్లో 100 మంది పతంగ్‌ ఫ్లయర్స్‌ తో పాటు ముప్‌పైకి పైగా కైట్‌ క్లబ్‌లు ఈ పెస్టివల్‌లో పాల్గొంటాయి. ఇక స్వీట్‌ ఫెస్టివల్‌లో భాగంగా ఆంధ్రా పూతరేకులు, తమిళ పొంగళ్, గుజరాత్‌ బాసుంది, జార్ఖండ్‌ అనార్సా, మణిపూర్‌ ఖీర్, సిక్కిం సీల్‌రోటీ ఇలా దాదాపు 1,200 రకాల స్వీట్లన్నీ ఒకే చోట నోరూరించనున్నాయి. జనవరి 13, 14, 15 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి వరకు ఈ స్టాళ్లు అందుబాటులో ఉంటాయి.

నగరానికి పండుగ కళ తీసుకువచ్చే క్రమంలో 2016 నుంచి కైట్, 2017 నుంచి స్వీట్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ యేడు కొత్తగా విలేజ్‌ గేమ్స్‌ అండ్‌ కల్చర్‌ ఈ వెంట్లను కొత్తగా తీసుకువస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది మరో కొత్త అంశాన్ని యాడ్‌ చేస్తామని తెలిపారు. ఈసారి జరిగే ఉత్సవాలకు 15 లక్షల మందికి పైగా జనాలు వస్తారని అంచనా వేశామని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.