తమిళిసై అనే నేను : తెలంగాణ తొలి మహిళా గవర్నర్ గా ప్రమాణస్వీకారం
తెలంగాణ తొలి మహిళా గవర్నర్ గా తమిళ ఇసై ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ

తెలంగాణ తొలి మహిళా గవర్నర్ గా తమిళ ఇసై ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ
తెలంగాణ తొలి మహిళా గవర్నర్ గా తమిళ ఇసై ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, విపక్ష నేతలు, బీజేపీ నేతలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, దత్తాత్రేయ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, పలువురు మంత్రులు సైతం ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవడం విశేషం. గవర్నర్ గా ప్రమాణం చేసిన తమిళ ఇసైకి సీఎం కేసీఆర్ సహా పలువురు అభినందనలు తెలిపారు. గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేశాక తమిళిసై తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు.
ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే తెలంగాణ కొత్త మంత్రులతో గవర్నర్ తమిళి ఇసై ప్రమాణస్వీకారం చేయిస్తారు. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే ప్రభుత్వం సౌందరరాజన్కు అందించింది. సెప్టెంబర్ 1న 5 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ.. రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందులో భాగంగా.. తెలంగాణ నూతన గవర్నర్గా నరసింహన్ స్థానంలో.. తమిళసై సౌందరరాజన్ను నియమించారు.
తమిళ ఇసై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారు. తమిళ ఇసై సౌందరరాజన్ వృత్తి రీత్యా డాక్టర్. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ జన్మస్థలం. తమిళ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. అదే సమయంలో విద్యార్థి సంఘం నాయకురాలిగానూ పనిచేశారు. ఇప్పటివరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లుగా ఎంపీగా పోటీ చేసినా.. ఒక్కసారి కూడా ఆమె విజయం సాధించలేకపోయారు.