Kenya Road Crash : కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం, 48 మంది మృతి

కెన్యా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పశ్చిమ కెన్యాలో రద్దీగా ఉండే జంక్షన్‌లో ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 48 మంది మృతి చెందినట్లు కెన్యా దేశ పోలీసులు తెలిపారు....

Kenya Road Crash : కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం, 48 మంది మృతి

Kenya Road Crash

Kenya Road Crash : కెన్యా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పశ్చిమ కెన్యాలో రద్దీగా ఉండే జంక్షన్‌లో ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 48 మంది మృతి చెందినట్లు కెన్యా దేశ పోలీసులు తెలిపారు.
పలు మినీబస్సుల శిధిలాలు,బోల్తా పడిన ట్రక్కుతో కార్మికులు చిక్కుకుపోయారని పోలీసులు చెబుతున్నారు.

Hyderabad: దొంగలు ఎంతపని చేశారు.. రైలు నుంచి జారిపడి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

కెరిచో- నకురు పట్టణాల మధ్య హైవేపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 48 మంది మరణించారని, మరో ఇద్దరు ట్రక్కు కింద చిక్కుకున్నారని అనుమానిస్తున్నట్లు కెన్యా దేశ పోలీసు కమాండర్ జియోఫ్రీ మాయెక్ చెప్పారు. ఈ ప్రమాదంలో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిని ఆసుపత్రులకు తరలించామని పోలీసులు చెప్పారు.

Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో కల్లోలం..! రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి? కేంద్ర కేబినెట్‌లోకి బండి సంజయ్?

నియంత్రణ కోల్పోయిన ట్రక్కు 8 వాహనాలు, మోటారుసైకిళ్లు, రోడ్డు పక్కన ఉన్న విక్రేతలను ఢీకొట్టింది. లోండియాని జంక్షన్ రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని కెన్యా రవాణ శాఖ మంత్రి కిప్ఛుంబా ముర్కో మెన్ ట్విట్టరులో తెలిపారు. సంఘటన స్థలానికి అంబులెన్సులు, సహాయ కార్యకర్తలు, కెన్యా రెడ్ క్రాస్ కార్యకర్తలను రప్పించారు.

PM Modi in Metro: ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమానికి మెట్రోలో వెళ్లిన ప్రధాని మోదీ

కెన్యాలో కురుస్తున్న భారీవర్షాలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. కెన్యా నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ సేఫ్టీ అథారిటీ గణాంకాల ప్రకారం గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 21,760 మంది వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంపై కెరిఖో కౌంటీ గవర్నర్ ఎరిక్ ముటాయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.