పాకిస్తాన్ లో శతృఘ్న సిన్హా, ప్రెసిడెంట్ తో భేటీ
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి షాట్ గన్ గా పిలుచుకొనే సినీ నటుడు శతృఘ్న సిన్హా పాకిస్తాన్ కు వెళ్లారు. పాక్ లో వ్యాపారవేత్త, ఫిల్మ్ మేకర్ అయిన..అసద్ అహ్ సాన్ ఆహ్వానంపై ఆయన అక్కడకు వెళ్లారు. వివాహంలో పాల్గొనాలని అసద్ ఆహ్వానించారు. ఇది పూర్తిగా తన పర్సనల్ టూర్ అని, రాజకీయపరమైంది మాత్రం కాదని సిన్హా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా..సిన్హా…లాహోర్ లో అధ్యక్షుడు డాక్టర్ ఆరీఫ్ అల్వితో భేటీ అయ్యారు.
భారత్ – పాక్ దేశాల సరిహద్దులో శాంతి నెలకొల్పడంపై వీరిద్దరూ చర్చించారు. భారత ప్రభుత్వం కాశ్మీర్ లో ఆంక్షలు విధించడం, పలువురు రాజకీయ నాయకులను నిర్బందించడంపై అల్వీ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
Read More : ఏం బతుకులు మీవి..ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి ఫైర్
ఇదిలా ఉంటే..పాక్, రాజకీయ సినీ ప్రముఖులతో కలిసి సిన్హా దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. లాహోర్ జరిగిన వివాహ వేడుకల్లో సిన్హా పాల్గొనడంపై నెటిజన్లు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Actor & Congress leader Shatrughan Sinha at a wedding function in Lahore, Pakistan at the invitation of Pakistani businessman Mian Asad Ahsan. (21.02.20) pic.twitter.com/jCOMNys0ME
— ANI (@ANI) February 21, 2020