ఏపీ యువకునికి అమెరికాలో 10ఏళ్ల జైలు శిక్ష

అమెరికాలో ఏపీకి యువకునికి పదేళ్ల జైలు శిక్ష పడింది. చిత్తూరు జిల్లాకు చెందిన విశ్వనాథ్ ఆకుతోట(27) 2015లో స్టూడెంట్ వీసాతో అమెరికా వెళ్లాడు. అల్బనీ సిటీలోని సెయింట్ రోజ్ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న ‘యూఎస్బీ కిల్లర్’ బగ్తో 66 కంప్యూటర్లను పనికిరాకుండా చేసిన విశ్వనాథ్ కొన్ని కంప్యూటర్లను ఫిజికల్గా పగలగొట్టాడు.
దీంతో కాలేజీకి రూ.40 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ఆ కంప్యూటర్లను తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు కాలేజీకి రూ.5,10,900 ఖర్చు అవగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే చేసిన నేరాన్ని ఒప్పుకున్న విశ్వనాధ్ తోట.. కాలేజ్కు జరిగిన డ్యామేజ్ చెల్లిస్తానని చెప్పాడు.
ఈ కేసును విచారించిన కోర్టు విశ్వనాథ్కు 10 ఏళ్లు జైలు శిక్ష, 17,349,100 జరిమానా విధించింది. జైలు నుంచి విడుదలయ్యాక మూడేళ్లపాటు పర్యవేక్షణలో ఉండాలంటూ వెల్లడించింది. ఆగస్టులో ఈ శిక్ష ఖారారు అవనుంది.